CM Revanth Reddy : రెండు కొత్త పథకాలను ప్రారంభించిన తెలంగాణ సర్కార్..
- మైనార్టీ మహిళలకు ₹50,000 ఆర్థిక సహాయం.. స్వయం ఉపాధికి ప్రోత్సాహం
- ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ కొనుగోలుకు ₹1 లక్ష సాయం
- అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరణ
- మైనార్టీల స్థిర అభివృద్ధికి పునాది వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. వాటి పేర్లు ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన’, ‘రేవంతన్నకా సహారా మిస్కీన్ కేలియే’. రాష్ట్ర మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ పథకాలను ప్రారంభించారు. ఈ పథకాల కోసం ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ పథకం కింద మైనార్టీ వర్గాలకు చెందిన వితంతువులు, అనాథలు, ఒంటరి మహిళలు, అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం ₹50,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ నిధులతో వారు చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు లేదా ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఫఖీర్, దుదేకుల వర్గాలకు చెందిన వారికి మోపెడ్ కొనుగోలుకు ₹1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
CM Relief Fund Scam: మామూలు కేటుగాళ్లు కాదు.. ప్రభుత్వ ఖజానాకే కన్నం.. !
ఈ రెండు పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉంది. దరఖాస్తులు 2025 అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆఫ్లైన్ దరఖాస్తులు తీసుకోరు. ఈ పథకాలతో మైనార్టీల స్థిరమైన అభివృద్ధికి పునాది పడుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న పథకాలు తీసుకొస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే, మైనార్టీ విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కొనసాగుతోంది. ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ఒక్కొక్కరికి ₹20 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
Uttam Kumar Reddy : అంచనాలు లేనివేళ ఖర్చు లెక్కలు ఎలా..? హరీష్ రావు గణితం కొత్త మ్యాజిక్.!
తాజావార్తలు
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!