DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
- కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్
- తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే దేశంలోనే నంబర్వన్గా గుర్తింపు
- పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్ నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అమలు చేయడంలో పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే దేశంలోనే నంబర్వన్గా గుర్తింపు తెచ్చుకుందని, విప్లవాత్మక మార్పులతో ఒక బ్రాండ్గా ఎదిగిందని అన్నారు. తన హయాంలో కూడా ఇదే స్థాయిలో శాఖ పనితీరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వేగంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేస్తామని తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు మంచి రికార్డు ఉందన్నారు. గత నాలుగేళ్లుగా ఆందోళనలు, పండుగలు, బందోబస్తు, పెద్ద ఈవెంట్ల నిర్వహణలో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా విధి నిర్వహణలో మరింత విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. రోజురోజుకీ నేరాల స్వరూపం మారుతోందని సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు సిస్టమ్లను హ్యాక్ చేయడం, ప్రజలను మభ్యపెట్టడం, భయపెట్టి డబ్బులు దోచుకోవడం వంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం జిల్లాల వారీగా ఎస్పీలు కూడా చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
మాదకద్రవ్యాల సమస్య ఇప్పుడు పిల్లల వరకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈగల్, హెచ్-న్యూ విభాగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. యాంటీ నార్కోటిక్ డ్రైవ్లను జిల్లా స్థాయి నుంచే కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణ తమ టాప్ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్లను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఫుట్పాత్లను ఆక్రమణల నుంచి క్లియర్ చేయడం, రోడ్డు మార్కింగ్లను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షకు పైగానే ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చైల్డ్ ట్రాఫిక్ భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
కలుషిత ఆహారం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్ శాఖ స్పందనను మరింత మెరుగుపరచాలని చెప్పారు. వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా పోలీసుల సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టుల నియంత్రణలో గ్రేహౌండ్స్ బలగాలు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ బలగాలపై పునఃసమీక్ష చేస్తున్నామని వెల్లడించారు.
పోలీస్ శాఖలో ప్రస్తుతం 19 వేల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. రిక్రూట్మెంట్, ట్రైనింగ్ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఏఐ అనేక రంగాల్లో వినియోగంలో ఉందని, ఫస్ట్ రెస్పాండర్గా ఉన్న పోలీస్ శాఖ కూడా ఏఐని ఎంతవరకు సమర్థంగా వినియోగించుకోవచ్చో పరిశీలిస్తున్నామని చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!