DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
- కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్
- తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే దేశంలోనే నంబర్వన్గా గుర్తింపు
- పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్ నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అమలు చేయడంలో పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే దేశంలోనే నంబర్వన్గా గుర్తింపు తెచ్చుకుందని, విప్లవాత్మక మార్పులతో ఒక బ్రాండ్గా ఎదిగిందని అన్నారు. తన హయాంలో కూడా ఇదే స్థాయిలో శాఖ పనితీరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వేగంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేస్తామని తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు మంచి రికార్డు ఉందన్నారు. గత నాలుగేళ్లుగా ఆందోళనలు, పండుగలు, బందోబస్తు, పెద్ద ఈవెంట్ల నిర్వహణలో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా విధి నిర్వహణలో మరింత విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. రోజురోజుకీ నేరాల స్వరూపం మారుతోందని సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు సిస్టమ్లను హ్యాక్ చేయడం, ప్రజలను మభ్యపెట్టడం, భయపెట్టి డబ్బులు దోచుకోవడం వంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం జిల్లాల వారీగా ఎస్పీలు కూడా చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు.
Also Read
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
మాదకద్రవ్యాల సమస్య ఇప్పుడు పిల్లల వరకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈగల్, హెచ్-న్యూ విభాగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. యాంటీ నార్కోటిక్ డ్రైవ్లను జిల్లా స్థాయి నుంచే కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణ తమ టాప్ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్లను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఫుట్పాత్లను ఆక్రమణల నుంచి క్లియర్ చేయడం, రోడ్డు మార్కింగ్లను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షకు పైగానే ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చైల్డ్ ట్రాఫిక్ భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
కలుషిత ఆహారం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్ శాఖ స్పందనను మరింత మెరుగుపరచాలని చెప్పారు. వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా పోలీసుల సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టుల నియంత్రణలో గ్రేహౌండ్స్ బలగాలు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ బలగాలపై పునఃసమీక్ష చేస్తున్నామని వెల్లడించారు.
పోలీస్ శాఖలో ప్రస్తుతం 19 వేల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. రిక్రూట్మెంట్, ట్రైనింగ్ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఏఐ అనేక రంగాల్లో వినియోగంలో ఉందని, ఫస్ట్ రెస్పాండర్గా ఉన్న పోలీస్ శాఖ కూడా ఏఐని ఎంతవరకు సమర్థంగా వినియోగించుకోవచ్చో పరిశీలిస్తున్నామని చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
-
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!