Telangana MLC ByPoll: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
Telangana MLC ByPoll: నిన్న అసెంబ్లీ, మొన్న లోక్ సభ, నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారం ముగియనుండడంతో పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రచారానికి ఇవాల్టితో గడువు ముగుస్తుండటంతో ఓరుగల్లుకు అగ్ర నేతలు,ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల కోసం ముఖ్యనేతల సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కు ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రలోభాలు జోరందుకున్నాయి. అగ్ర పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తు, నియోజకవర్గాలు, మండలాలు గ్రామాల, వారీగా కెడర్ ను కలిసి అభ్యర్థుల గెలుపుకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో ఉండగా ఈనెల 27న పోలింగ్ జరగనుంది.
Read also: Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
తెలంగాణలో సోమవారం నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలు జరగనున్నాయి. నేటితో పోలింగ్ ముగియనుండటంతో పట్టభద్రులు ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తలపడుతున్నారు. అందుకే పేరుకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం, ప్రలోభాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేశారు. విజయం సాధించారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఖాళీ అయ్యేలా బీఆర్ఎస్ తీవ్రంగా పోరాడుతోంది. పట్టభద్రుల్లో కూడా తమకు పట్టు ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ సీటు దక్కితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చని బీజేపీ ఆలోచిస్తోంది.
Fire Accident: రంగారెడ్డి శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం..
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!