KTR Reacts on Farmhouse Dealings: ఫామ్హౌస్ డీల్పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఇక కోర్టులు ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫామ్హౌస్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోలుకు కోసం జరిగిన డీలింగ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… బీజేపీపై ఛార్జిషీట్ విడుదల చేశారు.. 1. నీతి ఆయోగ్ చెప్పినా ఫ్లోరైడ్ నివారణకు నిధులు ఇవ్వలేదు, 2016లో జేపీ నడ్డా చెప్పిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఇవ్వలేదు, 2. చేనేతపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని నరేంద్ర మోడీడీ, నూలు సబ్సిడీ తగ్గింపు, ఖాదీ బోర్డ్ రద్దు, 3. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, 4. నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం, 5. గ్యాస్ ధర పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు లాంటి అంశాలను చార్జిషీట్లో పేర్కొన్నారు.. అయితే, ఈ సందర్భంగా మీడియా నుంచి కేటీఆర్కు ఎమ్మెల్యేల డీల్ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. నేను కేవలం చార్జిషీట్పైనే మాట్లాడుదాం అనుకుంటే.. నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నారంటూ.. మొత్తంగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్..
Read Also: TRS vs BJP : బీజేపీ పై టీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల..
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.. దానిపై ఇప్పుడు మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారని అంటారన్నారు మంత్రి కేటీఆర్.. ఈ వ్యవహారంపై సందర్భాన్ని బట్టి సీఎం కేసీఆర్ మాట్లాడతారని తెలిపిన ఆయన.. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. ఇక, దొంగ ఎవరు… దొర ఎవరో తెలిసిపోయింది.. ప్రజల ముందుకు అన్నీ వచ్చాయని గుర్తుచేశారు. బండి సంజయ్ ప్రమాణం చేయడంపై హాట్ కామెంట్లు చేశారు కేటీఆర్… ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే పోలీసులు, కోర్టులు అవసరం ఉండదన్న ఆయన.. బండి సంజయ్ ప్రమాణాలు చేస్తే కోర్టులు ఎందుకు ? అంటూ ప్రశ్నించారు.. ఇదే సమయంలో.. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో బండి సంజయ్.. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని తాకారు.. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి… యాదాద్రి టెంపుల్ అధికారులను నేను కోరుతున్నాను.. లక్ష్మి నరసింహస్వామికి సంప్రోక్షణ చేసి.. భక్తుల మనోభావాలను గౌరించాలని పేర్కొన్నారు.. ఇంకా.. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!