Harish Rao: ప్రభుత్వ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ప్రభుత్వ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెరిగిన డిస్పెన్సరీల ప్రకారం అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఒకేరోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని, ఇది దేశంలోనే వైద్య విద్యలో రికార్డు అని అన్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కొత్తగా నియమితులైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్రావు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. 1331 మంది ఆయుష్ కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేశామన్నారు. 2014 నుంచి వైద్యారోగ్య శాఖలో 22,263 మందిని నియమించినట్లు తెలిపారు. రానున్న 2 నెలల్లో 9,222 కొత్త పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్లో ప్రస్తుతం 54 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూన్ నుంచి 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, ఒక్కో కాలేజీకి దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
నోటిఫికేషన్ విడుదలైన ఐదు నెలల్లోనే వైద్యారోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది. నిరుడు డిసెంబర్ 6న 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 34 విభాగాల్లో ఈ ఖాళీలను ప్రకటించారు. మల్టీ జోన్-1లో 574 పోస్టులు, మల్టీ జోన్-2లో 573 పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ 20 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఫిబ్రవరి 2 నుంచి దరఖాస్తుల పరిశీలన, సర్టిఫికెట్ల పరిశీలన.. 20న రోస్టర్ జాబితా ప్రకటించారు. మార్చి 28న ప్రాథమిక మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. సమర్పణలను పరిశీలించి 8వ తేదీన తుది జాబితాను విడుదల చేశారు. వారిలో 1,061 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం. కొత్తగా రిక్రూట్ అయిన వారంతా DME కింద పని చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోంది. ఆయా కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మెడిసిన్ విభాగం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టింది. దీంతో వైద్య కళాశాలల్లో సిబ్బందిని నియమించారు. ఈ నియామకాలతో రాష్ట్రంలో వైద్య విద్య మరింత పటిష్టం కానుంది.
GHMC: నగరంలో రోడ్ల తవ్వకాలపై నిషేధం.. తక్షణమే అమల్లోకి రానున్న ఆదేశాలు
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!