Inspiration :HEC వైపు అడుగులు.. స్టేట్ ర్యాంకులతో గిరిజన బిడ్డ హర్ష సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్మీడియట్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి MPC, BiPC గ్రూపులే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెజారిటీ విద్యార్థులు ఈ కోర్సుల వైపు పరుగులు తీస్తుంటారు. ఈ క్రమంలో HEC, CEC గ్రూపులకు ఆదరణ తగ్గిపోతున్న తరుణంలో, ఒక గిరిజన విద్యార్థి తన స్పష్టమైన లక్ష్యంతో అందరి కళ్లు తెరిపించాడు. పదవ తరగతిలో 500కు పైగా స్కోరు సాధించిన ఏ విద్యార్థి అయినా సహజంగానే కార్పొరేట్ కాలేజీల వైపు చూస్తారు. కానీ, హర్ష మాత్రం తన లక్ష్యం పట్ల ఉన్న స్పష్టతతో గురుకుల కాలేజీని వెతుక్కుంటూ వచ్చాడు. తనకి HEC (History, Economics, Civics) గ్రూపులో సీటు కావాలని అడిగినప్పుడు, అక్కడి లెక్చరర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇంత మంచి మార్కులు వచ్చిన అబ్బాయి వారం రోజుల్లో మనసు మార్చుకుని మళ్ళీ MPCకో, BiPCకో వెళ్తాడని అందరూ అనుకున్నా కానీ, హర్ష ఆ అంచనాలను తలకిందులు చేశాడు.
Also Read:Sudheer- Deepika Pilli : వెకేషన్లో సుధీర్ – దీపికా.. సీక్రెట్ లవ్ బట్టబయలు?
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
తరగతి గదిలో పాఠాలను వినడమే కాదు, వాటి లోతుపాతులను చర్చించడంలో హర్షది ప్రత్యేక శైలి. అతని ఆసక్తిని, సబ్జెక్టుపై ఉన్న పట్టును చూసి CEC లో జాయిన్ అయిన మరో ఐదుగురు విద్యార్థులు తమ గ్రూపును HECకి మార్చుకున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే, సెల్ఫ్ ప్రిపరేషన్ మరియు గ్రూప్ డిస్కషన్స్తో ఆడుతూ పాడుతూ చదువును సాగించాడు. ఫలితంగా తాజాగా విడుదలైన 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో 492/500 మార్కులు సాధించి స్టేట్ 2nd ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. హర్ష సాధించిన విజయం ఒక ఎత్తు అయితే, అతడిని చూసి గ్రూపు మార్చుకున్న ఆ ఐదుగురు విద్యార్థులలో ముగ్గురు 430+ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. సామాన్య విద్యార్థులను స్టేట్ లెవల్ ర్యాంకర్ల స్థాయికి చేర్చడంలో ‘మంచి స్నేహం’ ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో ఈ ఘటనే నిదర్శనం. ప్రభుత్వ కాలేజీలు అంటే కేవలం పాస్ మార్కులకే పరిమితం అనే అపోహను ఈ విద్యార్థులు పటాపంచలు చేస్తున్నారు. గతేడాది (2025) ఇంటర్ ఫలితాల్లో ఇదే కాలేజీకి చెందిన ఫర్హాన్ అనే విద్యార్థి CEC 495/500 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది గిరిజన తెగకు చెందిన హర్ష స్టేట్ 2nd ర్యాంక్తో ఆ వారసత్వాన్ని కొనసాగించాడు. సివిల్స్ సాధించాలనే బలమైన సంకల్పంతో, ఇంటర్మీడియట్ లోనే ఇంతటి పరిణితిని హర్ష ప్రదర్శించడం గర్వకారణం.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!