Telangana Inter Exams : విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్ వచ్చేసింది..!
- ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు
- విద్యార్థుల పోటీ పరీక్షల సిద్ధతకు అవకాశం
- 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు
- నవంబర్ 11 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ఈసారి ఇంటర్ పరీక్షలు మామూలుగా మార్చిలో కాకుండా ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం విద్యార్థులు JEE మెయిన్, EAPCET (EAMCET), NEET వంటి పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఎక్కువ సమయం దొరకడం. ఈ మార్పుతో విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం అదనపు సమయం లభిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్లో మార్పులు అమలుకానున్నాయి. గణితం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం వంటి ముఖ్యమైన సబ్జెక్టుల్లో కొత్త కాన్సెప్ట్స్ చేర్చబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు ఉండగా, ఈసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకూ ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
జనవరి 21న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జనవరి 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి ఫస్ట్ ఇయర్ రాత పరీక్షలు, ఫిబ్రవరి 26 నుంచి సెకండ్ ఇయర్ రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనున్నాయి.
పరీక్ష ఫీజుల చెల్లింపు ప్రక్రియ నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా కొనసాగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు గడువులోపు ఫీజులు చెల్లించి తమ హాల్టికెట్లు పొందాలని సూచించింది. ఈసారి విడుదలైన షెడ్యూల్ వల్ల విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత సమర్థవంతంగా సిద్ధం కావడానికి అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!