Telangan High Court: బీజేపీకి ఎదురుదెబ్బ.. ఫాంహౌస్ నిందితుల విచారణకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court Lifted Stay On Moinabad Episode Case: మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కి కొన్ని రోజుల ముందు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా.. ఫాంహౌస్లోనే వాళ్లను పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు.. ఇప్పుడు ఆ స్టేను ఎత్తివేసింది. మొయినాబాద్ పోలీసులు నిందితులపై దర్యాప్తు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. నిందితుల పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కూడా తీర్పునిచ్చింది. అలాగే.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను పెండింగ్లో పెట్టిన హైకోర్టు, తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
కాగా.. ఆ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లుగా గుర్తించగా విషయం విదితమే! ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుగానే పోలీసులకు సమాచారం అందించగా.. ఫాంహౌస్లో చర్చలు జరుపుతున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి, ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. తొలుత వీరి కస్టడీకి ఏసీబీ కోర్టు నిరాకరించడంతో.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు నిందితుల రిమాండ్కి హైకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది కానీ.. కేసు దర్యాప్తుపై మాత్రం స్టే విధించింది. ఇప్పుడు తాజాగా ఆ స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో.. ఆ ముగ్గురు వ్యక్తులు బీజేపీకి చెందిన వారిగా అర్థమవుతోంది. పలుసార్లు ఆ వ్యక్తులు అమిత్ షాతో పాటు జేపీ నడ్డా పేర్లను కూడా ప్రస్తావించారు. తాజా కోర్టు తీర్పు.. బీజేపీ పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!