Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana High Court Issued Stay Order On Teachers Promotion Of Ranga Reddy

Rangareddy: ప్రమోషన్లు ఇవ్వొద్దు.. రంగారెడ్డి టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే..

Published Date :September 17, 2023 , 11:45 am
By NTV WebDesk
Rangareddy: ప్రమోషన్లు ఇవ్వొద్దు.. రంగారెడ్డి టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rangareddy: రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 19 వరకు పదోన్నతులపై స్టే ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక సీనియారిటీ జాబితాపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది డి.బాలకిషన్ రావు వాదించారు. ప్రిలిమినరీ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తగిన సమయం ఇవ్వకుండానే పదోన్నతులకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిశీలించాకే తుది సీనియారిటీ జాబితాను రూపొందిస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వివరాలను సమర్పించేందుకు ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్‌ఈ, రంగారెడ్డి డీఈవోలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు అనుమతి..

Also Read

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
  • PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్‌మైండ్ ఎవరు.?
  • Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ దంపతులకు వారి సేవలకు పది పాయింట్లు అదనంగా ఇచ్చారు. ఫిబ్రవరిలో జరిగే వెబ్ కౌన్సెలింగ్‌లో 73,803 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే భార్యాభర్తలు, ఉద్యోగ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన ధర్మాసనం… జియోపై స్టే విధిస్తూ మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో.. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే ..

మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ టి. వినోద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా వాదించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు చీకుడు ప్రభాకర్, పివి కృష్ణయ్య వాదించగా, ప్రభుత్వం తరపున అడిషనల్ ఎజి రామచంద్రరావు వాదించారు. నిబంధనల సవరణ చట్టం ప్రకారం జరగలేదని ప్రభాకర్ వాదించారు. జేఈవో ద్వారా నిబంధనలలో మార్పులు చేయడం కుదరదని న్యాయవాది కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. భార్యాభర్తల కేటగిరీ అమలు చేయాల్సి వస్తే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని వివరించారు. బదిలీలకు సంబంధించి నిబంధనలను రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు కేటాయించడం సబబు కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు కేటాయించడం సబబు కాదని అభిప్రాయపడింది. దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించేందుకు అనుమతించిన కోర్టు.. భార్యాభర్తలు కలిసి ఉండేలా నిబంధన పెట్టినట్లు తెలిపింది. అదనపు పాయింట్లను పక్కన పెట్టి బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, అన్ని బదిలీలు తుది తీర్పుకు లోబడి ఉంటాయి. హైకోర్టు ఆదేశాలతో దాదాపు 30 వేల మంది బదిలీలతో పాటు దాదాపు 9 వేల మందికి పదోన్నతులు లభించనున్నాయి.

Amit Shah: సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణకి విముక్తి లభించేది కాదు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • high court
  • High Court Stay
  • High Court stay on teachers'
  • High Court stay on teachers' promotions
  • Rangareddy

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions