NTV Telugu Site icon

ఏ4 సైజు పేపర్‌ వినియోగంపై హైకోర్టులో విచారణ

సాధారణంగా బయట ఏ4 సైజు పేపర్‌ను వాడితే.. కోర్టులు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయలు.. ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏ4 కంటే కాస్త పొడవైన పేపర్లు వాడుతుంటారు.. అయితే, హైకోర్టులో ఏ4 సైజు పేపర్‌ను ఉపయోగించడంపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.. తెలంగాణ హైకోర్టు మరియు అన్ని సబార్డినేట్ కోర్టులలో అన్ని న్యాయపరమైన ప్రయోజనాల కోసం రెండు వైపులా రాసిన ఏ4 సైజు పేపర్లను మాత్రమే ఉపయోగించాలంటూ మయూర్ ముంద్రా అనే న్యాయవాది రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. దీనిపై హైకోర్టు ప్యానెల్ విచారించింది.

Read also: వైఎస్‌ వివేకా కేసులో మరో అరెస్ట్.. మా నాన్నకు సంబంధం లేదంటూ సీబీఐకి లేఖ

అయితే, పేపర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అది కాలుష్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాదించారు పిటిషనర్.. ఉత్పత్తి సమయంలో క్లోరిన్ ఆధారిత బ్లీచ్‌లను ఉపయోగిస్తారని, దీని ఫలితంగా మన నీరు, గాలి మరియు మట్టిలోకి విష పదార్థాలు విడుదలవుతాయని పిటిషన్‌ వాదనలు వినిపించారు.. ఇక, గత 2 దశాబ్దాలలో దాదాపు 386 మిలియన్ హెక్టార్ల అటవీప్రాంతం కోల్పోయామని.. ఇది కలప పంటను కోల్పోవడానికి దారితీసిందని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పేపర్ అవసరాల నిమితం పొదుపుగా వాడాలని.. ఏ4 సైజు పేపర్లను రెండు వైపుల పూర్తిగా వినియోగించాలని.. ఒకవైపు మాత్రమే వాడరాదని పేర్కొంది.. దీనికి సంబంధించిన ఓ సర్క్యులర్‌ను కూడా వెంటనే జారీ చేయబడుతుంది ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది, వాతావరణం, అడవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేసింది హైకోర్టు.