NTV Telugu Site icon

తెలంగాణ ఆరోగ్యశాఖ కీల‌క ఆదేశం: ఆగ‌స్టు 31 లోపు…వాటికి ఏర్పాటు చేయండి…

తెలంగాణ‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా తీవ్ర‌త, క‌రోనా థ‌ర్డ్ వేవ్ భ‌యం పొంచి ఉండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  తెలంగాణ‌లోని అన్ని ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు.  ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి త‌గిన మొత్తంలో ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని ఆదేశించింది. ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌ని ఆసుప‌త్రుల‌కు లైసెన్స్‌ల‌ను రద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించింది.  200 వ‌ర‌కు బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుప‌త్రులు 500 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సీజ‌న్ జ‌ర‌రేష‌న్ ప్లాంట్లు, 200 నుంచి 500 వ‌ర‌కు బెడ్స్ ఉన్న ప్రైవేట్ ఆసుప‌త్రులు 1000 ఎల్‌పీఎం, 500 కంటే ఎక్కువ బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుప‌త్రుల్లో 2000 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సీజ‌న్ జ‌న‌రేష‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని వైద్యారోగ్యశాఖ తెలియ‌జేసింది.  వీటిని ఆగ‌స్టు 31 వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాల‌ని ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Read: