Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Govt Facilitate Megastar Chiranjeevi Venkaiah Naidu

Telangana Govt: పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు

Published Date :February 4, 2024 , 1:36 pm
By Bhanu
Telangana Govt: పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Telangana Govt: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు.

చిరంజీవి మాట్లాడుతూ..

Also Read

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
Add as a preferred
source on google

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డులు ఇవ్వలేదని, అది కొంచెం బాధగా ఉందని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో గద్దర్ పేరుతో ఆ అవార్డ్ ఇస్తాము అని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలన్నారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ వచ్చినందుకు అంత ఉస్తాహం లేదన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే ప్రథమం అన్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు. నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు అవుతోందన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వటం సంతోషమన్నారు. తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వాళ్ళలో వెంకయ్య నాయుడు ఒకరని తెలిపారు. వెంకయ్య నాయుడు వాగ్ధాటికి నేను పెద్ద అభిమానిని అన్నారు.

రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు తగవు…ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయన్నారు. వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లకు తిప్పికొట్టే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. కళను గుర్తించి అవార్డులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలన్నారు. పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల పేర్లను ముందుగా ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోడీదే అన్నారు. సామాజిక సేవ చేసే భాధ్యత ఆర్టిస్ట్ లు స్వయంగా రావాలన్నారు. నా అభిమానులు నాకోసం ప్రాణాలు కాదు – రక్తం ఇవ్వాలన్నారు. నేను అవార్డుల కోసం ఎదురు చూడను, అవార్డులు రావాలని కోరుకోనని తెలిపారు. ఈ అవార్డులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలన్నారు.

Read also: TDP-Janasena Alliance: ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్!

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తి వెంకయ్య నాయుడుకు అవార్డ్ రావడం సంతోషమన్నారు. చిన్నప్పటి నుంచి నాకు అభిమాన నటుడు చిరంజీవికి అవార్డ్ రావడం… ఆ సన్మాన సభలో నేను ఉండడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సినిమా అవార్డులు గద్దర్ పేరుతో ఇస్తామనడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలుగు వాళ్ళకు పద్మా అవార్డులు పొందడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమన్నారు. వెంకయ్య నాయుడు విద్యార్థి దశలోనే రాజకీయ పరిణితి చెందారని తెలిపారు. ప్రతిపక్షంలో బలం తక్కువగా ఉన్నా ఎలా ప్రభుత్వాన్ని ప్రశించాలో వెంకయ్య నాయుడును చూస్తే చాలన్నారు. దుర్బాషలు మాట్లాడకుండా రాజకీయాలు ఎలా చేయాలో వెంకయ్య నాయుడు చూసి నేర్చుకోవాలన్నారు. స్వయంకృషి తో సినిమా ఇండస్ట్రీలో తారా స్థాయికి చేరిన గొప్ప హీరో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిరంజీవితో అసెంబ్లీలో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పద్మ విభూషణ్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అవార్డును స్వీకరిస్తున్నానని అన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరిపినందుకు రేవంత్ రెడ్డికి అభినందనలని తెలిపారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింతగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నా అన్నారు. తెలుగు కళామతల్లికి మూడో కన్ను మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అసభ్యత, అశ్లీలత, హింసకు తావు ఇవ్వకుండా నటించడం కష్టమైన పనే అన్నారు. జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల ఉంటే ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలిపారు. రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లోనే ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. జనాలను రెచ్చగొట్టే నాయకులకు ప్రజలకు సరైన బుద్ధి చెప్పాలని తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. రాజకీయాల్లో ట్రిపుల్ – C నడుస్తోందని.. క్యాస్ట్, కమ్యూనిటీ, క్రిమినాల్టి నడుస్తోందని అన్నారు.

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌ !

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • megastar chiranjeevi
  • padma award winners
  • telangana facilitate padma awardees
  • Venkaiah Naidu

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions