Hyderabad: నాన్వెజ్ ప్రియులకు గుడ్న్యూస్.. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ మటన్ క్యాంటీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నాన్ వెజ్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తక్కువ ధరలకు నాణ్యమైన మటన్ బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలను అందించడానికి సిద్ధం చేన్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ వంటకాలను వడ్డించనున్నారు. హైదరాబాద్లోని మాసాబ్ట్యాంక్ సమీపంలోని శాంతినగర్లో ఈ నెల 12న ‘తెలంగాణ మటన్ క్యాంటీన్’ ప్రారంభం కానుంది. ఇప్పటికే శాంతినగర్లో ప్రారంభించిన చేపల క్యాంటీన్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మటన్ క్యాంటీన్ పై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ల అనుమతితో క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం సమీపంలో క్యాంటీన్ను నిర్మించారు. ముందుగా హైదరాబాద్లో ప్రారంభించి అనంతరం అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరిస్తామని సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగిందన్నారు. అయినా మటన్ ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఈనెల 12న మొబైల్ క్యాంటీన్ల ఏర్పాటుకు యోచిస్తున్నామని వెల్లడించారు.
Read also: Jailer: విజయ్, అజిత్ లు స్టార్స్ అవ్వొచ్చు కానీ రజినీ సూపర్ స్టార్ మచ్చా…
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
మటన్ క్యాంటీన్ నాణ్యమైన మటన్ ఉత్పత్తులు.. మటన్ బిర్యానీ, కీమా, తలకాయ కూర, మటన్ టిక్కా వంటి అన్ని రకాలు సరసమైన ధరలకు విక్రయిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే గొర్రెలు, మేకల సంపద పెరిగింది. ప్రాథమిక పెంపకందారుల సొసైటీల ద్వారా గొర్రెల పెంపకందారులు లాభాలు గడిస్తున్నారు. ప్రైమరీ బ్రీడర్ సొసైటీలను ఇప్పుడు ఏర్పాటు చేయనున్న మటన్ మార్కెట్లకు అనుసంధానం చేస్తామని అధికారులు చెబుతున్నారు. నేరుగా మటన్ విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న మటన్ క్యాంటీన్లలో కురుమ, యాదవ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. పశుసంవర్థక శాఖ, పర్యాటక శాఖ, ఇతర శాఖల సమన్వయంతో ఈ క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.
Ramcharan : సనాతన ధర్మం పై వైరల్ అవుతున్న రాంచరణ్ పాత ట్వీట్..
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!