Telangana Floods : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Floods at Bhadradri Kothagudem Updates.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు తగ్గుతూ వస్తుంది నిన్న రాత్రి తగ్గిన గోదావరి మళ్లీ పెరిగి తగ్గడం ప్రారంభించింది. మూడు రోజుల క్రితం 71.3 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఆ తర్వాత క్రమేపి తగ్గుతూవస్తోంది. 1986లో అత్యధికంగా 75.6 అడుగులకు చేరుకోగా 1990లో 70 అడుగులకు చేరుకుంది. ఆ తర్వాత ఈ స్థాయికి మళ్లీ ఇప్పుడే మొదటిసారి గోదావరి పెరిగింది . నిన్న రాత్రి గోదావరి దోబూచులాట ఆడింది. నిన్న రాత్రి వరకు తగ్గి మళ్లీ గోదావరి పర్యాటక ప్రాంతంలో వరదలు వర్షాలు బాగా రావడంతో పాటు మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి కూడా 12 లక్షల పైగా విడుదల చేశారు. దీంతో మళ్లీ కొంతమేరకు గోదావరికి వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గత రాత్రి ఏడు పాయింట్లు అంటే ఒక అడుగు లోపే పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తగ్గడం ప్రారంభించింది ప్రస్తుతం భద్రాచలం గోదావరి నీటిమట్టం 55.8 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది మరింత తగ్గితే మరో రెండు అడుగులు తగ్గితే మూడవ ప్రమాద హెచ్చరికను తొలగిస్తారు. 48 అడుగులకి తగ్గితే రెండో ప్రమాద హెచ్చరిక, 43 అడుగుల వరకు తగ్గితే మొదటి ప్రపంచ హెచ్చరిక ఉపసంహరిస్తారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవటంతో గోదావరి ప్రాంతంలో వరదలు కూడా తగ్గుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వల్ల అన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ భద్రాచలం రెవిన్యూ డివిజన్ పరిధిలోని చర్ల దుమ్ముగూడెం బూర్గంపాడు అశ్వాపురం మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ఇప్పటివరకు జాతీయ రహదారిపై ఇంకా నీళ్లు వల్ల రవాణాకి ఆటంకం గానే ఉంది . వరదలు వస్తాయని తెలిసినప్పటికీ ముందస్తుగా సహాయ చర్యలను తీసుకోవడాం లో ప్లాన్ చేయడం అంచనాలు వేయడంలో అధికారులు విఫలమయ్యారు. వరదల వల్ల సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరికి నిత్యవసర వస్తువుల సరఫరాకి ఆర్మీ హెలికాప్టర్ రావాల్సి వచ్చింది. గతంలో ముందుగానే లాంచీలను సిద్ధం చేసుకునే వారు ప్రస్తుతం అటువంటి మందస్తు చర్యలకు గత అధికారులు స్వస్తి పలికారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇక్కడ గురయ్యారు. కాగా భద్రాచలం వద్ద రామాలయం పక్కనే స్లూయిజ్ లీకేజీ వల్ల రామాలయం చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో నీళ్లు వచ్చి చేరాయి దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు అధికారల వైఖరి పట్ల దుమ్మెత్తి పోస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
-
NTRNEEL : నందమూరి ఫ్యాన్స్కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
-
Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
-
IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
-
Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?