Hyderabad Manhole: మ్యాన్ హోల్ ప్రమాదాలపై తెలంగాణ డీజీపీ సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Manhole: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో.. రుతుపవనాలు వేగంగా విస్తరించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాల నేపథ్యంలో వాహనదారులకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా కీలక సూచనలు చేశారు. వర్షం వస్తే మ్యాన్హోల్స్ తెరుచుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలంగాణ డీజీపీ ప్రయాణికులకు కోరారు.
Read also: Hyderabad Metro: పెరగనున్నమెట్రో ఛార్జీలు..! ఇందులో నిజమెంత?
Also Read
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
డీజీపీ సూచనలు..
* సంబంధిత వాహన నిపుణులతో మీ వాహనం టైర్ల గ్రిప్/థ్రెడ్ స్థితిని తనిఖీ చేయండి. టైర్లు గ్రిప్పీగా లేకుంటే, వెంటనే వాటిని మార్చండి.
* మీ వాహనం టైర్లలో గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
* వర్షం పడుతున్నప్పుడు పరిమిత వేగంతో నడపడం మంచిది.
* మీ వాహనం ఇంజిన్ పరిస్థితిని తనిఖీ చేయండి. బ్రేక్ ప్యాడ్లు మరియు విండ్స్క్రీన్ వైపర్ల పరిస్థితిని రెండుసార్లు తనిఖీ చేయండి.
* అవసరమైతే మీ వాహనాల్లో అత్యవసర కిట్లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి.
* అత్యవసర పరిస్థితుల్లో #Dial100కి కాల్ చేయడానికి మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ని సెటప్ చేయండి.
* ఈ సూచనలు మీకు, మీ కుటుంబ భద్రతకు చాలా మంచివన్నారు.
తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Maoist Landmines: దడ పుట్టిస్తున్న మందు పాతరలు.. ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్..
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!