Hyderabad Metro: పెరగనున్నమెట్రో ఛార్జీలు..! ఇందులో నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ వార్తలో నిజమెంతనో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఫ్రీ బస్సులో ప్రయాణికులు రద్దీ నెలకొంటుంది. దీంతో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిందని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. ఎండాకాలంలో ఎండవేడిమి తట్టుకోలేక చాలామంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆశక్తి చూపారు. అయితే ఇప్పుడు వానాకాలం మొదలవుతుంది. ఇప్పుడు మళ్లీ ప్రయాణికులు బస్సుబాట పట్టనున్నారు. దీంతో మళ్ళీ మెట్రోకు ప్రయాణికులు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇదంగా దృష్టిలో వుంచుకుని మెట్రో చార్జీలు పెంచారా? అనే వాదనలు వినపిస్తున్నాయి. అయితే పెరిగిన ఈ మెట్రో చార్జీలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది ఇంకా క్లారిటీ రాలేదు.
Read also: Madhyapradesh : ఆసుపత్రిలో మూడో అంతస్తు నుంచి జారిన లిఫ్టు.. నలుగురికి తీవ్ర గాయాలు
Also Read
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
- Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో.. ఉన్నతాధికారుల సూచన మేరకు.. టికెట్ ధరలను పెంచేందుకు ఎల్ అండ్ టీ సంస్థ సమాయత్తమవుతోంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో టికెట్ ధరలను పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఆ తర్వాత మెట్రో టికెట్ చార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మెట్రో ప్రారంభమైన ఛార్జీలే ఇప్పటికీ అమలులో ఉన్నాయి. ఒక్కసారి మెట్రో చార్జీలు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచే అవకాశం లేదు. అందుకే అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఛార్జీలు ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో… ప్రస్తుతం మూడు లైన్ల ద్వారా రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గతంతో పోలిస్తే మెట్రో రద్దీ కాస్త తగ్గిందని చెప్పవచ్చు.
Read also: Telangana DGP: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. తెలంగాణ డీజీపీ పేరుతో ఫేక్ కాల్
ప్రతి నెలా రూ. 45 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 540 కోట్ల నష్టం వాటిల్లిందని ఎల్ అండ్ టీ తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మెట్రోలో 2 కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర రూ.10. 2-4 కిలోమీటర్ల దూరానికి రూ.15 టికెట్ వసూలు చేస్తున్నారు. అలాగే 4-6 కి.మీ. దూరానికి రూ.25, 6-8 కి.మీ. దూరానికి రూ.30, 8-10 కి.మీ. దూరానికి రూ.35, 10-14 కి.మీ. దూరానికి రూ.40, 14-18 కి.మీ. దూరానికి రూ.45, 18-22 కి.మీ. దూరానికి రూ.50, 22-26 కి.మీ. దూరానికి రూ.55, 26 కి.మీ కంటే ఎక్కువ దూరానికి రూ.60 టిక్కెట్ ధర. అంటే ప్రస్తుతం ప్రారంభ టిక్కెట్ ధర రూ.10 కాగా.. గరిష్టంగా రూ. 60 ఉన్నాయి. టికెట్ రేట్లు 5-10 శాతం పెంచబడతాయి మరియు కనీస ధర రూ. గరిష్ఠ ధర రూ.20, రూ.80 వరకు పెంచే అవకాశం ఉన్నందున.. ప్రయాణికుల భారం పెరుగుతుందని తెలుస్తుంది.
Madhyapradesh : ఆసుపత్రిలో మూడో అంతస్తు నుంచి జారిన లిఫ్టు.. నలుగురికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!