తెలంగాణలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి..తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 494 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో నలుగురు మృతి చెందారు.. ఇదే సమయంలో 710 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,153 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,27,964 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,784కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.94 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 97.32 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్.