తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 657 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 704 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,030 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,24,477 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,766కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.87 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 97.34 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్.