Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీతో పాటు పలు అంశాలపై చర్చ
- ఇవాళ సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం..
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం..
- కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీతోపాటు కీలక అంశాలపై చర్చ..
- ప్రధానంగా రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీతోపాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. పరిపాలనకి సంబంధించిన అనేక అంశాల పై చర్చించనున్నారు. ఇరు రాష్ట్రల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణ పై చర్చ..కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ పై మహారాష్ట్ర, రాజస్థాన్ లో పర్యటించి తెలంగాణ అధికారులు బఅధ్యయనం చేశారు. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం పై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వనికి ఆదాయం వచ్చే మార్గాల పై దృష్టి సారించారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, లిక్కర్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలపై చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
Read also: Health Tips : ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే రోజూ ఈ డ్రింక్ ను తాగాల్సిందే..
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ప్రధానంగా అర్హత ప్రాతిపదికన కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకోవడంతోపాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, రైతు బీమా,పంటల బీమా కోసం కిసాన్ సమ్మాన్ ఫండ్ అర్హతను కూడా ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కింది. దీంతో హైదరాబాద్ లోని ఏపీ ఆస్తులతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్పై కసరత్తు చేస్తోంది. ఈ అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Read also: India-China: పాసింజర్ విమానాలను పునఃప్రారంభించాల కోరిన చైనా..భారత్ నిరాకరణ
కాగా 15లోగా రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రైతు బంధు పథకం కింద తెలంగాణలో సుమారు 66లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. కాగా.. వీరిలో రూ.2లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంతకుముందే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నాట్లు సమాచారం. దీంతో రైతు బంధు లబ్దిదారుల్లో దాదాపు 6లక్షల మందికి పట్టాదారు పాస్బుక్ లు లేవు కావున వాని ప్రమాణికంగా తీసుకుంటే లబ్దిదారుల సంఖ్య 60లక్షలకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
Read also: Friday Stotram: శుక్రవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే రుణ బాధలు తొలగిపోతాయి
ఇది ఇలా ఉంటే.. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి రైతు బంధు వస్తోంది. వారందరికి రేషన్ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంటుంది. రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని దీంతో మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని క్యాబినెట్ వర్గాలు సమాలోచనలో ఉన్నట్లు టాక్. ఇక మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లంపుదారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే.. మరో రెండు లక్షల మంది తగ్గుతారని అధికారులు అంచనా వేస్తు్న్నారు. దీంతో ఇవన్నీ పరిగనలోకి తీసుకుంటే రుణమీఫీ పథకానికి అర్హులయ్యేవారు సుమారు 40 లక్షల మంది వరకే ఉంటారని అంటున్నారు. మరి దీనిపై ఇవాళ జరిగే కేబినెట్ మీటింగ్లో ఏఏవి చర్చకు వస్తాయనే దానినిపై ఉత్కంఠ నెలకొంది.
Vivo Y58 5G Price: ‘వివో’ కొత్త స్మార్ట్ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ! ధర కూడా తక్కువే
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!