Teegala Krishna Reddy: మంత్రి సబితకు మరో తలనొప్పి.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తన సొంత నియోజకవర్గం మహేశ్వరంలో తలనొప్పులు తప్పడం లేదు.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బడంగ్పేట్లో సబితా ఇంద్రారెడ్డి.. టీఆర్ఎస్లో చేరిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. మున్సిపల్ ఎన్నికల్లో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.. కానీ, తాజాగా, టీఆర్ఎస్ నుంచి మేయర్ చిగురింత పారిజాతా నరసింహారెడ్డి తిరిగి సొంతగూడైన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత పార్టీ కండువా కప్పుకోవడంతో మంత్రి సబితకు షాక్ తగిలినట్టు అయ్యింది.. మరోవైపు, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు మంత్రి సబితను టార్గెట్ చేయడంతో కొత్త తలనొప్పి మొదలైనట్టు అయ్యింది.
మంత్రి సబితపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. మీర్పేట్ మున్సిపాలిటీని సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.. మీర్పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు తీగల.. అంతేకాదు, తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.. ఇక, మంత్రి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపించిన ఆయన.. చెరువులు, స్కూళ్ల స్థలాలను కూడా వదలడం లేదని విమర్శించారు.. టీఆర్ఎస్ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని.. ఇదే సమయంలో అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్తో మాట్లాడనున్నట్టు వెల్లడించారు..
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి తీగల కృష్ణారెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామలతో.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఆమెను మంత్రి పదవి కూడా వరించింది.. అయితే, టీఆర్ఎస్లో మంత్రి సబిత కంటే సీనియర్గా ఉన్న తీగల కృష్ణారెడ్డితో ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది.. ఈ రెండు వర్గాల మధ్య ఆదినుంచి ఆధిపత్య పోరు సాగుతున్నా.. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో బహిర్గతం అయ్యాయి. వరుస పరిణామాలు తన సొంత నియోజకవర్గంలో మంత్రి సబితకు తలనొప్పిగా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?