Etala Rajender: టెక్నికల్ గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etala Rajender: మునుగోడు ఫలితాల్లో జాప్యం తగదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. శామీర్ పేట నివాసం నుండి ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగారని అన్నారు. మునుగోడులో ఓడిపోతే పార్టీ భవిష్యతే ప్రశ్నార్ధకమవుతుందని భావించి ఆయనతో సహా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డపెట్టాలి అని ఆదేశించారని ఆరోపించారు. టెక్నికల్గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు. మంత్రులు పనిచేసిన గ్రామాల్లో కూడా వారి చెంప చెళ్లుమనిపించారు. కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. డబ్బు సంచులు, మద్యం బాటిల్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం పనిచేయదని మరోసారి నిరూపితమైందన్నారు. హుజురాబాద్, దుబ్బాకలో చెప్పిన కూడా కేసీఆర్ కి ఇంకా జ్ఞానోదయం రాలేదని విమర్శించారు.
Read also: Munugode Bypoll Results: బీజేపీ అభ్యర్థిని కలిశాడు..! అడిషనల్ ఎస్పీపై వేటు
Also Read
మునుగోడులో కూడా అదే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న నల్లగొండ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావడం గొప్ప పరిణామంగా భావిస్తున్నానని, ఒక నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి దబాయించి పనిచేయగలిగాడు రేపు జనరల్ ఎలక్షన్లో ఇలాంటి పరిస్థితి ఉండదని అన్నారు. మునుగోడు ప్రజా స్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపు. మార్పుకు నాంది. కేసీఆర్ నమ్ముకున్న డబ్బు-మద్యంకు కాలం చెల్లిందని అన్నారు. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మ్రోగిస్తుంది అనడానికి మునుగోడులో భారతీయ జనతా పార్టీ పోరాటం నిదర్శనమన్నారు. నైతికంగా బీజేపీ విజయం సాధించిందని అన్నారు. కేసీఆర్ నైతికత కోల్పోయారని, సీఎం రోడ్లు రావు, మోరీలు రావు, అభివృద్ధి జరగదు అంటూ బెదిరించిన కూడా ప్రజలు అభివృద్ధి కంటే ఆత్మగౌరవం ముఖ్యమని బీజేపీకి ఓట్లు వేశారని ఈటెల రాజేందర్ అన్నారు.
Read also: Video Call Fraud: యువతి అందాలకు ఫ్లాట్.. నగ్న వీడియో కాల్కి బుక్
TRS గెలిస్తేనే రేపు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉండదు అని హుకుం జారీ చేసి అధికారులందరినీ చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ అడుగులకి మడుగులు వత్తే విధంగా పని చేయించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించి, దాడులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. వందల కోట్ల రూపాయలు పోలీసు వాహనాల్లో తీసుకువచ్చి ప్రజలకు పంచిపెట్టారని మండిపడ్డారు. వందలలారీల లిక్కర్ తీసుకువచ్చి ప్రజలకు తాగిపించారు. అనేక బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు.
Etala Rajender: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయ దుందుభి మ్రోగిస్తుంది
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!