Teacher Posts: టెట్ పరీక్షలపై బీఈడీ అభ్యర్ధుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం.. త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇందులో ఉపాధ్యాయు పోస్టులు కూడా ఎక్కువగా ఉండటంతో డీఎస్సీ అభ్యర్థులు ప్రిపరేషన్లో పడిపోయారు. అయితే.. టెట్ విషయంలోనే కాస్త గందరగోళం నెలకొంది. బీఈడీ పూర్తిచేసిన బయాలజీ, లాంగ్వేజ్ పండిట్లు.. టెట్ని తలుచుకుని ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనకు కారణమేంటి?
ఓవైపు నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆనందం ఉన్నా.. కొందరు అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఇంటర్, డిగ్రీలో బయాలజీ చదివిన వారికి.. ఇప్పుడు గుండె దడ మొదలైంది. ఏ మాత్రం చదవని, అవగాహన లేని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తోండటంతో ఏం చేయాలో తెలియక కలవరపడుతున్నారు. ఎలా ప్రిపేరవ్వాలో తెలియక సతమతమవుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు టెట్ నిర్వహించారు. చివరి సారిగా 2017లో టెట్ ఎగ్జామ్ జరిగింది. SGTలకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2 నిర్వహిస్తారు. జాతీయ ఆదేశాల ప్రకారం ఈసారి పేపర్-1కు డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ పూర్తిచేసిన వారికీ అర్హత కల్పించాల్సి ఉంటుంది. టెట్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తే… ఓసీలకు 60 శాతం, బీసీలకు 50, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులని… అర్హత మార్కులుగా నిర్థారించారు. టెట్లో కనీస మార్కులు సాధిస్తేనే డీఎస్సీ పరీక్ష రాయడానికి వీలవుతుంది.
Also Read
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
రాష్ట్రంలో డీఈడీ పూర్తిచేసిన వారు లక్షా 50 వేల మంది, బీఈడీ అభ్యర్థులు మూడు లక్షల వరకు ఉన్నట్టు అంచనా. గతంలో టెట్ అర్హత సాధించని వారికి, 2017 తర్వాత బీఈడీ పాసైన బయాలజీ, లాంగ్వేజ్ పండిట్లకు ఇప్పుడీ పరీక్ష తలనొప్పిగా మారింది. డిగ్రీలో బయాలజీ చదివిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ కావాలంటే… వారు చదివిన సిలబస్ నుంచి కాకుండా… మాథ్స్, ఫిజిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో లాంగ్వేజ్ పండిట్లో టెన్షన్ ఎక్కువగా ఉంది. వారికి మాథ్స్, ఫిజిక్స్ అసలు టచ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
టెట్లో అభ్యర్థులు ఎలిజిబుల్ కావాలంటే 90శాతానికిపైగా మార్కులు సాధించాల్సి వస్తుంది. ఇది ఎలా సాధ్యం అనేది బయాలజీ అభ్యర్థుల ప్రశ్న. ఎంపీసీ అభ్యర్థుల మాదిరి తమకు కూడా బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తేనే అర్హత సాధించగలమంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టతనిస్తే గందరగోళం లేకుండా ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!