Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. బాపట్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయమై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ స్పందిస్తూ, రోగికి ప్రస్తుతం ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో కరోనా కేసుల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, రోగులకు తక్షణ సేవలు అందించేందుకు జీజీహెచ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా కరోనా సోకిన రోగులను ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రత్యేక కోవిడ్ వార్డును అందుబాటులోకి తెచ్చారు. అలాగే కరోనా లక్షణాలతో వచ్చే సాధారణ రోగులను పరీక్షించడానికి ప్రత్యేకంగా ‘కోవిడ్ అవుట్ పేషెంట్’ (OP) విభాగాన్ని ప్రారంభించారు. దీనివల్ల సాధారణ రోగులకు, కోవిడ్ అనుమానితులకు మధ్య సంప్రదింపులు తగ్గి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఉచితంగా పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా తక్షణమే చికిత్స ప్రారంభించేలా వైద్యులను ఆదేశించారు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ పట్ల ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కొత్త వేరియంట్ మునుపటి అంత తీవ్రమైనది కాకపోయినప్పటికీ, జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆసుపత్రిలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. వైద్య సిబ్బంది రక్షణ కోసం పీపీఈ (PPE) కిట్లు, నిర్ధారణ పరీక్షల కోసం టెస్టింగ్ కిట్లు, అలాగే కరోనా నివారణకు అవసరమైన అన్ని రకాల ప్రాణరక్షణ మందులను భారీ నిల్వల్లో సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు, శ్వాసకోస సమస్యలు తలెత్తితే తక్షణమే ప్రాణవాయువు అందించేందుకు వీలుగా ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు అధునాతన ఆక్సిజన్ పరికరాలను కూడా సిద్ధం చేసి ఉంచినట్లు ఆయన తెలిపారు. ప్రజలు స్వయం వైద్యం జోలికి వెళ్లకుండా, జ్వరం, జలుబు, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా సరైన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలని డాక్టర్ దుర్గా ప్రసాద్ కోరారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!