Aishwarya dead body: హైదరాబాద్కు చేరిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya dead body: మే 6న టెక్సాస్లోని ఓ మాల్లో కాల్పుల ఘటనలో మృతి చెందిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కీలక పాత్ర పోషించింది. అయితే అందుకు అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని భారత్కు పంపినట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధి కొల్లా అశోక్ బాబు తెలిపారు.
Read also: Ustaad: ఫస్ట్ లుక్ అదిరింది… హరీష్ శంకర్ కి గుడి కట్టినా తప్పులేదు రా…
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
శనివారం మధ్యాహ్నం టెక్సాస్లోని ప్రీమియం అవుట్లెట్ మాల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, చిన్నారులు సహా పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లో తెలంగాణకు రంగారెడ్డి జిల్లాకు చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లు అమెరికా అధికారులు నిర్ధారించారు. ఐశ్వర్య కుటుంబం హైదరాబాద్లోని కొత్తపేటలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టు మెజిస్ట్రేట్. కొన్నేళ్ల క్రితం ఐశ్వర ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ వెళ్లింది. మే 18 ఐశ్వర్య పుట్టినరోజు. దీంతో ఆమె బర్త్ డే పార్టీని గ్రాండ్ గా చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. అయితే… ఆ పార్టీకి డ్రెస్ కొనుక్కోవడానికి ఐశ్వర్య మే 6న అలెన్ మాల్కు వెళ్లింది. ఇంతలో ఆమె వెళ్లిన మాల్ లో ముష్కరులు కాల్పులు జరిపారు. మాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడింది. ఐశ్వర్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఐశ్వర్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డల్లాస్కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాలమైన షాపింగ్ కాంప్లెక్స్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం షాపింగ్ మాల్లోని కస్టమర్లు, ఉద్యోగులు ప్రాణాల కోసం పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని హతమార్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Jeevan Case: ఇన్స్టా పోస్ట్ పెట్టిన 8 గంటల్లోనే.. అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తాజావార్తలు
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!