Tarun Chugh: కేసీఆర్కు తరుణ్ చుగ్ సవాల్.. ఆ చర్చకు సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarun Chugh Open Challenge To CM KCR Over Central Funds: తెలంగాణ సీఎం కేసీఆర్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఓ సవాల్ విసిరారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అసలు ఎరువుల ఫ్యాక్టరీని తెరవడాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కర్మాగారం వల్ల ఒక్క తెలంగాణ రైతులకే కాకుండా.. యావత్ దేశానికి విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూతపడ్డ ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి.. జాతికి అంకితమిచ్చేందుకే నవంబర్ 12న ప్రధాని మోడీ రామగుండంకు వస్తున్నారన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ తన కొత్తు మిత్రులైన సీపీఐ, సీపీఎంలతో కలిసి మోడీ పర్యటనకు సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఎరువుల ఫ్యాక్టరీపై కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. అయితే కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా, విజ్ఞత గల తెలంగాణ ప్రజలు వాటిని నమ్మబోరని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయం గుర్తించాలన్నారు. ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కేసీఆర్ గానీ, ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వం గానీ ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ చొరవ తీసుకుని.. రూ. 6,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నారన్నారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏం చేయలేదని కేసీఆర్ చెప్తున్నారని.. 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో జాతీయ రహదారుల మొత్తం నిడివి 2,511 కిలోమీటర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 4,996 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివిలో 99 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. అలాగే.. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అంబర్పేట్ వద్ద రూ.186.71 కోట్లతో 4-లేన్ ఫ్లైఓవర్ను.. దాంతో పాటు దాంతోపాటు ఉప్పల్ నుండి నారపల్లి వరకు రూ.628.8 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు.
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
రైల్వేల్లో కూడా తెలంగాణకు కేంద్రం కేటాయింపులు భారీగా పెరిగాయని తరుణ్ చుగ్ వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో ప్రతీ సంవత్సరం సగటున రూ.1,110 కోట్ల కేటాయింపులు జరిగాయన్నారు. కేంద్రం రూ.4,200 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 699 కోట్లు చెల్లించడం లేదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక.. తెలంగాణలో రూ.31,281 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులను రైల్వేశాఖ చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కేంద్రం భాగస్వామ్యం ఉందన్నారు. తెలంగాణలో రోజురోజుకు ప్రాబల్యాన్ని కేసీఆర్ కోల్పోతున్నారని.. మునుగోడులో ఆశించిన మెజారిటీ దక్కకపోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళణలో ఆయన కూరుకుపోయారని తరుణ్ చుగ్ చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!