Tammineni Veerabhadram: బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తోంది.. అదో ప్రమాదకరమైన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram Sensational Comments On BJP: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఒక సాదాసీదా పార్టీ కాదని.. బీజేపీని ఆర్ఎస్ఎస్ అనే ఓ ప్రమాదకరమైన సంస్థ నడిపిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని బిజెపి భావిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు బీజేపీ కట్టబెడుతోందని వ్యాఖ్యానించారు. బిజెపి గెలిస్తే.. మోటార్లకు మీటర్లు పెడతారన్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ను గెలిపించాలని.. రాజగోపాల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని మునుగోడు ప్రజల్ని కోరారు.
ఇదే ర్యాలీలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కూడా బీజేపీపై ధ్వజమెత్తారు. బిజెపి కరోనా కంటే ప్రమాదమని.. డాఫర్, 420, డెకైట్ అందరూ కలిసి బీజేపీ రూపంలో మునుగోడుకు వస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణా బిల్లు, విభజన హామీలను గాలికి వదిలేశారన్నారు. కేసీఆర్ లాంటి నాయకులు కావాలని దేశం కోరుకుంటోందని.. ఈడీలు వచ్చినా, ఇంకెవరు వచ్చినా కేసీఆర్ బక్కప్రాణాన్ని ఏం చేయలేరని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలని.. తెలంగాణ సమాజం కోసం టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మునుగోడులో గెలిచేది టిఆర్ఎస్ పార్టీనే.. టిఆర్ఎస్ను గెలిపించేందుకే తాము వచ్చామని పేర్కొన్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 18 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొనేసిందని, కాంట్రాక్ట్ డబ్బులతో మునుగోడు ప్రజల్ని అంగడి సరుకులా కొనడానికి వచ్చారని విమర్శించారు. నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి నాలుగేళ్లుగా కనిపించలేదన్నారు. ఒక్కో ఓటును తాను డబ్బు పెట్టి కొంటానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే తానే మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ మాటిచ్చారు.
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!