Tammineni Veerabhadram: రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు మద్దతిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram Gives Clarity On Alliance With BRS Party: రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని, సీఎం కేసీఆర్ సూచనలతో ముందుకు సాగుతామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా.. తమ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తమ సీపీఎం పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ తిప్పికొడుతుందని ఉద్ఘాటించారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిద్దాం.. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుదామనే సంకల్పంతో.. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకుంది.
Upasana Konidela: భార్య ఒడిలో కూర్చొని గ్లోబల్ స్టార్ నవ్వులు.. ఇంటర్నెట్ ను షేక్ చేసే పిక్
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని.. బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రజా సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని, మోడీని ప్రధాని గద్దె నుంచి దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పని చేస్తాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీరు వ్యవసాయాన్ని నాశనం చేసేలా ఉందని.. అందుకు వ్యవసాయ చట్టాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ చట్టాలను రద్దు చేయాలని బలమైన పోరాటం సాగిందని, ఆ పోరాటంతోనే కేంద్రం వెనక్కు తగ్గిందని తెలియజేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరో షాక్.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు
బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. బ్రిటిష్ వారు సాగించిన పాలనని చూస్తామని, అది ఎంతో ప్రమాదకరమైందని తమ్మినేని హెచ్చరించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీకి.. తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముకుంటున్నారని విమర్శించారు. గత 8 సంవత్సరాల కాలంలో.. మోడీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల అప్పులను చేసిందని తెలిపారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!