Tammineni Veerabhadram: రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు మద్దతిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram Gives Clarity On Alliance With BRS Party: రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని, సీఎం కేసీఆర్ సూచనలతో ముందుకు సాగుతామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా.. తమ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తమ సీపీఎం పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ తిప్పికొడుతుందని ఉద్ఘాటించారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిద్దాం.. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుదామనే సంకల్పంతో.. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకుంది.
Upasana Konidela: భార్య ఒడిలో కూర్చొని గ్లోబల్ స్టార్ నవ్వులు.. ఇంటర్నెట్ ను షేక్ చేసే పిక్
Also Read
- Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని.. బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రజా సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని, మోడీని ప్రధాని గద్దె నుంచి దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పని చేస్తాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీరు వ్యవసాయాన్ని నాశనం చేసేలా ఉందని.. అందుకు వ్యవసాయ చట్టాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ చట్టాలను రద్దు చేయాలని బలమైన పోరాటం సాగిందని, ఆ పోరాటంతోనే కేంద్రం వెనక్కు తగ్గిందని తెలియజేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరో షాక్.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు
బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. బ్రిటిష్ వారు సాగించిన పాలనని చూస్తామని, అది ఎంతో ప్రమాదకరమైందని తమ్మినేని హెచ్చరించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీకి.. తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముకుంటున్నారని విమర్శించారు. గత 8 సంవత్సరాల కాలంలో.. మోడీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల అప్పులను చేసిందని తెలిపారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!