Tammineni Veerabhadram: రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు మద్దతిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram Gives Clarity On Alliance With BRS Party: రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని, సీఎం కేసీఆర్ సూచనలతో ముందుకు సాగుతామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా.. తమ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తమ సీపీఎం పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ తిప్పికొడుతుందని ఉద్ఘాటించారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిద్దాం.. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుదామనే సంకల్పంతో.. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకుంది.
Upasana Konidela: భార్య ఒడిలో కూర్చొని గ్లోబల్ స్టార్ నవ్వులు.. ఇంటర్నెట్ ను షేక్ చేసే పిక్
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని.. బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రజా సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని, మోడీని ప్రధాని గద్దె నుంచి దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పని చేస్తాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీరు వ్యవసాయాన్ని నాశనం చేసేలా ఉందని.. అందుకు వ్యవసాయ చట్టాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ చట్టాలను రద్దు చేయాలని బలమైన పోరాటం సాగిందని, ఆ పోరాటంతోనే కేంద్రం వెనక్కు తగ్గిందని తెలియజేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరో షాక్.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు
బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. బ్రిటిష్ వారు సాగించిన పాలనని చూస్తామని, అది ఎంతో ప్రమాదకరమైందని తమ్మినేని హెచ్చరించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీకి.. తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముకుంటున్నారని విమర్శించారు. గత 8 సంవత్సరాల కాలంలో.. మోడీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల అప్పులను చేసిందని తెలిపారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!