Uttam Kumar Reddy: ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ.. కాంగ్రెస్ మాత్రమే ఓటు వేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Take money from whoever gives but.. vote only Congress: బీజేపీ మత కొల్లోలాలు సృష్టిస్తుంది! తిప్పి కొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందని నల్లగొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్, ఉత్తంకుమార్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. టీఆర్ఎస్ రైతు వ్యతిరేక విధానాలతో రైతు ఆత్మహత్యలు తెలంగాణలో పెరిగిపోయాయని అన్నారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఏనాడు నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ తో దోస్తీ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు క్రాంటాక్ట్ పనులను రాజగోపాల్ రెడ్డి దక్కించుకున్నాడని మండిపడ్డారు. చర్లగూడెం ముంపు బాధితులను ఆదుకునే విషయంలో రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించాడని నిప్పులు చరిగారు. ఐదు శాతం జీఎస్టీతో చేనేత కార్మికుల పొట్ట కొట్టిన పార్టీ బీజేపీ, అలాంటి పార్టీతో రాజగోపాల్ రెడ్డి జతకట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.
కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ రైతులను మాత్రం నాడు రోడ్డున పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో కొత్త ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఏం అభివృద్ధి చేశారని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మునుగోడు ఓటర్లు చైతన్యవంతులు, విజ్ఞతతో ఓటేస్తారన్న నమ్మకం మాకుందని అన్నారు. బీజేపీ మునుగోడులో అడుగుపెడితే మత కొల్లోలాలు సృష్టిస్తుంది, తిప్పి కొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందని అన్నారు. మతకల్లోలాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాడిన పదజాలం, చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
CPI State Conference: రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు.. 800 మంది పాల్గొనే అవకాశం
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!