Uttam Kumar Reddy: ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ.. కాంగ్రెస్ మాత్రమే ఓటు వేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Take money from whoever gives but.. vote only Congress: బీజేపీ మత కొల్లోలాలు సృష్టిస్తుంది! తిప్పి కొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందని నల్లగొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్, ఉత్తంకుమార్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. టీఆర్ఎస్ రైతు వ్యతిరేక విధానాలతో రైతు ఆత్మహత్యలు తెలంగాణలో పెరిగిపోయాయని అన్నారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఏనాడు నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ తో దోస్తీ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు క్రాంటాక్ట్ పనులను రాజగోపాల్ రెడ్డి దక్కించుకున్నాడని మండిపడ్డారు. చర్లగూడెం ముంపు బాధితులను ఆదుకునే విషయంలో రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించాడని నిప్పులు చరిగారు. ఐదు శాతం జీఎస్టీతో చేనేత కార్మికుల పొట్ట కొట్టిన పార్టీ బీజేపీ, అలాంటి పార్టీతో రాజగోపాల్ రెడ్డి జతకట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.
కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ రైతులను మాత్రం నాడు రోడ్డున పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో కొత్త ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఏం అభివృద్ధి చేశారని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మునుగోడు ఓటర్లు చైతన్యవంతులు, విజ్ఞతతో ఓటేస్తారన్న నమ్మకం మాకుందని అన్నారు. బీజేపీ మునుగోడులో అడుగుపెడితే మత కొల్లోలాలు సృష్టిస్తుంది, తిప్పి కొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందని అన్నారు. మతకల్లోలాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాడిన పదజాలం, చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
CPI State Conference: రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు.. 800 మంది పాల్గొనే అవకాశం
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!