CBI : సిబిఐ చేతికి గట్టు వామనరావు దంపతుల కేసు
- న్యాయవాద దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్ట్ కీలక తీర్పు
- 2021 ఫిబ్రవరి 17న కీరాతకంగా వామనరావు దంపతుల హత్య
- హత్య జరిగిన నాలుగేళ్ళకు సుప్రీం ఆదేశాలతో సిబిఐ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI : ఢిల్లీ- తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కిరాతకంగా జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసును సిబిఐకి బదిలీ చేసింది సుప్రీం కోర్ట్.2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణిల హత్య జరిగింది. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు దంపతులను అడ్డుకొని నడిరోడ్డుపై హత్య చేశారు.
అయితే వామనరావు దంపతుల హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. కోర్టుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తన కొడుకు , కోడలు హత్య కేసును సిబిఐకి బదిలీ చేయ్యాలని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదులు మేనకా గురుస్వామి, చంద్రకాంత్ రెడ్డి లు వామనరావు తరపున వాదనలు వినిపించారు. వామనరావు కేసును సిబిఐకి ఇస్తే తమకేం అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. మరోవైపు చనిపోవడానికి ముందు వామన రావు మాట్లాడిన మాటలు అసలువేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది.
Also Read
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
వామనరావు హత్య కేసులో పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో పుట్ట మధు పేరు కూడా వినిపించింది. అయితే గత ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న మధును ఇప్పటి సర్కార్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్ట్ జస్టీస్ ఎం ఎం సుంధరేష్ ధర్మాసనం వామనరావు హత్య కేసును సిబిఐకి బదిలీ చేసింది.
MLA Nandamuri Balakrishna: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులకు శ్రీకారం..
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!