Monkeypox: మంకీపాక్స్ వైరస్.. తెలంగాణ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మరి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ అదుపులోకి వస్తుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతోందనే వార్త ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. సుమారు 200కు పైగా కేసులు నమోదు కూడా అయ్యాయని, మరో 100 అనుమానిత కేసులు ఉన్నాయని విశ్వయనీయ సమాచారం. అయితే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో పలుదేశాలు, రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం మంకీపాక్స్ వైరస్ నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పలు దేశాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఐసోలేషన్లో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల మంకీపాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒంటిపై దుద్దర్లు, రాషెస్ వచ్చిన అనుమానితులు వైద్యాధికారులను సంప్రదించాలని కోరింది. అనుమానితుల బ్లడ్ శాంపిళ్లను పూణెలోని ఎన్ఐవీకి పంపి టెస్టు చేస్తున్నట్లు పేర్కొంది.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
కాగా.. యురోప్, నార్త్ అమెరికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్పై తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆఫ్రికా, యూరోప్ లోని 14 దేశాలలో ఇప్పటికే ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కాగా తాజాగా తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అదుపులో ఉంచేందుకు ముందస్తు జాగ్రత్త చేపడుతున్నాయి.
గత 21 రోజుల ముందు విదేశీ పర్యటన చేసిన ప్రయాణికులలో దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్నవారిని స్క్రీనింగ్ టెస్టులు చేసి, వారిని ఐసోలేషన్లో చేర్చాలని తమిళనాడు ఆరోగ్య శాఖ కన్వీనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
మంకీపాక్స్ వైరస్ అనుమానితులకు మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని కస్తూరీబాయి ఆసుపత్రిలో 28 పడకల వార్డులను సిద్ధం చేసింది. కాగా సోమవారం బాంబే మెడికల్ కౌన్సిల్ ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు ఏమీ నమోదు కాలేదని ఓ ప్రకటన జారీ చేసింది. అయినప్పటికీ ఆసుపత్రులు “అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
మరో వైపు రాజస్థాన్ లో ఇటీవల విదేశీ పర్యటనలు చేసివచ్చిన వారిలో మంకీపాక్స్ అనుమానితులు నమూనాలను సేకరించి వాటిని నేషనల్ వైరాలజీ సంస్థకు పంపాలని ఆరోగ్యశాఖ వైద్యాధికారులను పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!