Farmers Festival: నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్నగర్లో రైతు పండుగ..
- నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్ నగర్ రైతు పండగ..
- రైతులకు వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు..
- రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Festival: ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు రైతు పండుగను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు సాగే రైతు సదస్సును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తుమ్మల నాగేశ్వర రావుతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
Read also: Nagababu Rajyasabha: రాజ్యసభకు నాగబాబుకు.. లైన్ క్లియర్ చేస్తున్న పవన్ కళ్యాణ్?
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. నేడు జరిగే సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేడు, రేపు జరిగే సదస్సుకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది రైతులు తరలిరానున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు మరియు వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొంటారన్నారు.
Read also: 2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరలించే ఛాన్స్..?
ప్రజాపాలన విజయోత్సవం, రైతు పండగపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకుంటోందన్నారు. మిగిలిన రైతు రుణమాఫీపై 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేస్తారని తెలిపారు. రైతుబంధు ఉత్సవాలకు వేలాది మంది రైతులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పంటలను ప్రదర్శించడానికి స్టాళ్లు, వచ్చే వాహనాలకు పార్కింగ్, తాగునీరు. తాత్కాలిక మరుగుదొడ్లు, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలు సిద్ధం చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు సీసీ కెమెరాల నిఘాలో రైతు పండగ కొనసాగనుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!