Farmers Festival: నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్నగర్లో రైతు పండుగ..
- నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్ నగర్ రైతు పండగ..
- రైతులకు వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు..
- రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Festival: ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు రైతు పండుగను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు సాగే రైతు సదస్సును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తుమ్మల నాగేశ్వర రావుతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
Read also: Nagababu Rajyasabha: రాజ్యసభకు నాగబాబుకు.. లైన్ క్లియర్ చేస్తున్న పవన్ కళ్యాణ్?
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. నేడు జరిగే సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేడు, రేపు జరిగే సదస్సుకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది రైతులు తరలిరానున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు మరియు వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొంటారన్నారు.
Read also: 2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరలించే ఛాన్స్..?
ప్రజాపాలన విజయోత్సవం, రైతు పండగపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకుంటోందన్నారు. మిగిలిన రైతు రుణమాఫీపై 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేస్తారని తెలిపారు. రైతుబంధు ఉత్సవాలకు వేలాది మంది రైతులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పంటలను ప్రదర్శించడానికి స్టాళ్లు, వచ్చే వాహనాలకు పార్కింగ్, తాగునీరు. తాత్కాలిక మరుగుదొడ్లు, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలు సిద్ధం చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు సీసీ కెమెరాల నిఘాలో రైతు పండగ కొనసాగనుంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?