Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్, ఏకంగా 20 రైళ్లు రద్దు..!
Trains Cancelled: సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో వారం రోజులుగా పలు రైళ్లను రద్దు చేశారు. నిర్వహణ పనుల కారణంగా రెండు డివిజన్లలో అనేక ప్యాసింజర్, MMTS రైళ్లు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని రైళ్లు పాక్షికంగా నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 18 రైళ్లు, 15 నుంచి 21వ తేదీ వరకు రెండు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ సందర్భంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
రద్దు చేయబడిన వాటిలో కాజీపేట- డోర్నకల్ (07753), డోర్నకల్- కాజీపేట (07754), డోర్నకల్- విజయవాడ (07755), విజయవాడ- డోర్నకల్ (07756), భద్రాచలం రోడ్- విజయవాడ (07278), విజయవాడ- భద్రాచలం రోడ్ (0799). అలాగే కాజీపేట – సిర్పూర్టౌన్ (17003), బల్లార్ష – కాజీపేట (17004), సిర్పూర్టౌన్ – భద్రాచలం రోడ్ (17034), సికింద్రాబాద్ – వరంగల్ (07462), వరంగల్ – హైదరాబాద్ (07463), సిర్పూర్టౌన్- కరీంనగర్ (07766), కరీంనగర్- నిజామాబాద్ (07893), కాజీపేట – బల్లార్ష (17035), కాచిగూడ – నిజామాబాద్ (07596), నిజామాబాద్ – కాచిగూడ (07593) రైళ్లు రద్దు చేయబడ్డాయి. భద్రాచలంరోడ్- బల్లార్ష (17033), బలార్ష-కాజీపేట (17036), కరీంనగర్- సిర్పూర్ టౌన్ (07765), నిజామాబాద్- కరీంనగర్ (07894) రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఈ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్లో 14 నుంచి 20వ తేదీ వరకు 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేశారు.
Also Read
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
- Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
- Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
12 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వచ్చే వారం వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 13, 14 తేదీల్లో తిరుపతి – కాకినాడ టౌన్ (07063), నర్సాపూర్ – తిరుపతి (07061), కాకినాడ టౌన్ – తిరుపతి (07064), తిరుపతి – నర్సాపూర్ (07062), కాచిగూడ – విల్లుపురం (07424), ఆగస్టు 15న విల్లుపురం – కాచిగూడ (07425), 16న కాచిగూడ-కాకినాడ టౌన్ (07039), 17న కాకినాడటౌన్-కాచిగూడ (17040), దక్షిణ మధ్య రైల్వే అధికారులు సమాచారం అందించారు.
Telangana Rains: తెలంగాణలో వర్షాలకు ఛాన్స్.. వచ్చే మూడ్రోజులు కురిసే అవకాశం
తాజావార్తలు
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!