Suspicion: అనుమానంతో నిండుప్రాణం బలి.. బాబాయ్ పై కొడవలితో దాడి
Suspicion: అనుమానం పెను భూతం లాంటిది. ఒక్కసారి ఎదుటి వ్యక్తి పై అనుమానం వస్తే చాలు వారిని కడతేర్చే వరకు కంటిమీద కునుకు పట్టదు. అది మన కుటుంబంలోని వారైనా లేక వేరొకరైనా సరే. ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా కల్లూరులో చోటుచేసుకుంది.
Read also: Drive in Theatre: సినిమా ప్రియులకు పండగే.. ఇకపై కార్లలో కూర్చొనే సినిమా చూడొచ్చు
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావు స్థానికంగా ఎల్లమ్మ, ఉప్పలమ్మ దేవతలకు పూజారిగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం సంజీవరావు అనే మరో వ్యక్తితో కలిసి పొలానికి మందు వేసేందుకు వెళ్లాడు. వెళుతున్న క్రమంలో శ్రీనివాసరావుకి కుమారుడి వరసయ్యే శివ అకస్మాత్తుగా కత్తి, వేట కొడవలితో వచ్చి దాడికి దిగాడు.
పక్కనున్న సంజీవరావు కాపాడేందుకు ప్రయత్నించగా తప్పుకోకుంటే నీపైనా దాడి చేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన సంజీవరావు పక్కకు వెళ్లి గ్రామస్తులకు ఫోన్ చేస్తుండగానే శివ శ్రీనివాసరావుపై వేట కొడవలితో మెడ, కాళ్లు, వీపుపై విచక్షణారహితంగా నరికాడు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే శివ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే శివ, శ్రీనివాస్ రావును ఎందుకు చంపాడు అన్నదానిపై కారణం అతని పై అనుమానం. శివ కుటుంబంలో కొంత కాలంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
దీనికి గల కారణం చేతబడి చేయడమే అని బలంగా నమ్మాడు. అదికూడా.. వరుసకు బాబాయ్ అయ్యె శ్రీనివాసరావే చేశాడని శివ బలంగా నమ్మాడు. శ్రీనివాసరావుపై కోపం పెంచుకున్న శివ శ్రీనివాసరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాసరావు ఆదివారం పొలానికి వెళ్లినట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. శివ, శ్రీనివాసరావు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే చేతబడి అనుమానం తప్పితే గతంలో వారిద్దరి మధ్యా ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు.
Read also: Sandhya Sreedhar Rao: నేను ఎవరినీ మోసం చేయలేదు.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి
ప్రత్యక్ష సాక్షి సంజీవరావు మాటలు..
పొలంలో మందు చెల్లెందుకు వచ్చిన సమయంలో శివ వచ్చి ఘర్షణ పడి వేట కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశాడని సంజీవరావు పేర్కొన్నాడు. అడ్డుకోపోయిన తనపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడని అక్కడినుండి పారిపోయి పోలీస్ లకు సమాచారం అందించినట్లు తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు హత్య జరిగిన తీరును పరిశీలించి ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ఆధారంగా కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. శ్రీనివాసరావు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!