Vemulawada: రాజన్న ఆలయంలో శివకళ్యాణోత్సవాలు.. నేడు స్వామివారికి రుద్రాభిషేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మూడవరోజు శివ కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆలయ అర్చకులు స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు, జంగమ అర్చకులు కలిసి బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల మార్చి 27 నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు మార్చి 31 వరకు శివ కళ్యాణోత్సవం వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే యాగశాల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఐదు రోజుల పాటు జరిగే శివ కల్యాణోత్సవ వేడుకలకు ఇక రెండు రోజులు ఉన్నందున.. ఆలయం లోపలి భాగాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. శివ కళ్యాణ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు, వేసవి కాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈరోజు శివ కళ్యాణ ఉత్సవాలు మొదటి రోజు ఉదయం 8.05 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం దైవసేవ నిర్వహించారు.
Read also: Neha Shetty: పేరు మార్చుకున్న నేహా శెట్టి? ఏంటో తెలుసా?
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
అనంతరం ఈరోజు సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, వాస్తు హోమం, శివ మహాపురాణ ప్రవచనం నిర్వహిస్తారు. రాత్రి భేరీపూజ, దేవతా ఆవాహన, మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిన్న 28వ తేదీ ఉదయం 10.50 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి స్వామివార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ (29)న తీర్థరాజస్వామి పూజ ఆవాహిత దైవార్చన, బలిహరణం, ఔపాసనం, కల్యాణ మండపంలో రాత్రి సభ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు (30)వ తేదీ సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఎల్లుండి (31)న పూర్ణాహుతి, క్షేత్రపాలక బలి, ధర్మగుండంలో త్రిశూలయాత్ర, రాత్రి ఏకాదశ ఆవరణ, అనంతరం ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శివ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించాలని సూచించారు.
China : అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే.. చైనాకు తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
తాజావార్తలు
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!