వైఎస్సాటీపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల జాతీయ జెండాను ఎగుర వేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధికారప్రతినిధులు, పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడారు. నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఉద్యోగాలు రావడం లేదంటూ సాగర్ లాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగభృతి అని హామీ ఇచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.
Read Also: దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే?
తెలంగాణ కోసం ఎంతమందైతే ఆత్మబలిదానాలు చేసుకున్నారో ఇప్పుడు నోటిఫికేషన్లు రావడంలేదంటూ అంతమంది చనిపోతున్న పాలకుల్లో కొంచెం కూడా చలనం లేదంటూ విమర్శించారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవాలనే చట్టం ఉంటే బాగుండు అని షర్మిల అన్నారు. తెలంగాణాలో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్నారు. పోలీసులను పనివాళ్లుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకపక్షానికి ఒకలాగా ప్రతిపక్షాలకు మరోలా రూల్స్ ఉండటం భావ్యం కాదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
