షర్మిలకు అన్నీ షాక్లే, తెర వెనుక ఎవరి “హస్తం” ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణను ఉద్దరించటానికి ఈ మధ్యనే పుట్టిన YSRTP కి ఆదిలోనే హంసపాదులా అన్నీ షాక్లే … నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే.. సర్కార్ కొలువు దొరక్క నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరికోసమైతే ఇదంతా చేస్తున్నారో వారి నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. అదే పెద్ద షాక్!!
షర్మిల ఈ దీక్షలతో ఆత్మహత్యల అంశాన్ని హైలైట్ చేయాలనుకున్నారు. వారి కష్టాలను ఎత్తిచూపాలని బావించారు. అందుకు.. ఎంపిక చేసిన తెలంగాణ గ్రామాల్లో ఉపవాస దీక్ష చేస్తున్నారు. వీటిని వేదికగా చేసుకుని కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు. సర్కార్ పనితీరుపై ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నారు. తాజాగా ఆమె మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టాలనుకున్నారు. గ్రామానికి చెందిన పట్టభద్రుడు నరేశ్ ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న నిరాశతో బలవన్మరణం చెందాడు. నరేష్ జ్ఞాపకార్థం షర్మిల నిరాహార దీక్ష చేయాలనుకుంది. అయితే, నరేష్ తండ్రి తన ఇంటికి రావొద్దని కోరడంతో ఆమె షాక్కు గురైంది. ఆమె నుంచి తనకు ఎలాంటి సానుభూతి అక్కర్లేదని చెప్పాడు. ఇది షర్మిల సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న YSRTP నాయకులను కూడా షాక్కు గురి చేసింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు వారికి. నరేష్ తో పాటు ఆయనకు మరో ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురూ సర్కార్ కొలువుల్లో ఉన్నారు. ఇప్పుడీ షర్మిల దీక్ష వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయేమో అని నరేష్ తండ్రి భయపడ్డాడు. దాంతో ఆమె తన ఇంటికి రావద్దని చెప్పేశాడు.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
వైఎస్ షర్మిల దీక్షకు పూనుకుని ఏడు వారలవుతోంది. వారానికో గ్రామం వెళుతున్నారు. వెళ్లిన చోటల్లా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుద్యోగ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని..మీకు అండగా ఉంటానని ఎంత చెప్పినా ఎందుకో ప్రజల నుంచి స్పందన కరువైంది. ఇదే వైయస్ షర్మిలను ఎక్కువ ఇబ్బంది పెడుతోంది.
ఇక పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఇందిరా శోభన్ గత శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఇది షర్మిలకు పెద్ద షాక్. పార్టీ పెట్టక ముందే కాంగ్రెస్ ని వీడి షర్మిల వెంట నడిచిన ఇందిర ఇంత హటాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు. సరైన ప్రాధాన్యత లేకపోవటం వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఇందిర చెప్పారు. కానీ ఇది పైకి చెప్పే కారణం..తెరవెనక కథ ఇంకేదో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా వెనక్కి తీసుకోవాలని షర్మిల ఆమెకు ఫోన్ చేసినట్టు సమాచారం. ఇకపై బాగా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చారట. ఐనా ఇందిర ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇందిరా శోభన్ రాజీనామా వెనక రేవంత్ రెడ్డి ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమెను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రేవంత్కు సన్నిహితురాలైన ఎమ్మెల్యే సీతక్క కూడా ఇందిరతో మాట్లాడారని అంటున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని రేవంత్ వదులుకోవట్లేదు. ఇందిర బాటలోనే మరికొందరు నడుస్తారని టాక్..
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!