Mancherial: శరణ్య హత్య కేసులో ట్విస్ట్.. బయట పడ్డ భర్త ఆడియో..!
Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన శరణ్య అనే వివాహిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సీ.ఐ.ఎస్.ఎఫ్ లో శరణ్య భర్త జియా ఉల్ హక్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. అయితే జియా విడాకుల కోసం శరణ్యను వేధించడం మొదలు పెట్టాడు. కాగా శరణ్య విడాకులు ఇచ్చేందుకు ససేమిరా అంది. విడాకులు ఇవ్వనని చావనైనా చస్తా కానీ విడాకుల ఇవ్వనంటూ చెప్పడంతో ఆమెపై పగను పెంచుకున్నాడు. నువ్వు విడాకులు ఇవ్వకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఫోన్ చేసి బెదిరించాడు. అయినా ఆమె బెదరకుండా విడాకులు ఇవ్వనని మెండికేసింది. భార్య శరణ్య ప్రవర్తనపై కోపంతో ఐదారు రోజుల పాటు హత్యకు రెక్కీ వేశాడు. భార్య శరణ్యను చంపేందుకు 6 లక్షలకు పైగా సుపారి ఇచ్చాడు. దీంతో డీల్ ప్రకారం శరణ్య దుండగులు అమెపై దాడి చేసి కిరాతకంగా చంపేశారు. ఏమీ తెలియనట్లు చేతులు దులుపుకునేందుకు జియా భార్య శరణ్య చనిపోయిందంటూ అమాయకంగా నటించాడు.
Read also: Pawan Kalyan: మళ్లీ విశాఖకు పవన్కు.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
అయితే శరణ్య మరణం కుటుంబ సభ్యులకు తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదంతా భర్త జియా పనేనంటే ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శరణ్య హత్యపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులు జియా ఆడియో పోలీసులకు ఇవ్వగా.. అసలు కథ వెలుగులోకి వచ్చింది. జియానే భార్య శరణ్యను హత్యకు కుట్రచేసి, ఆమెను చంపాడని క్లారిటీ రావడంతో జియాను అతను సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు శరణ్య భర్త జియా ఆడియో వైరల్ గా మారింది. ఆడియోలో నేను కనిపించకుండానే నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ భార్య శరణ్యకు జియా ఇచ్చిన వార్నింగ్ కూడా వుందని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేశామని, సూత్ర దారులు పాత్ర దారులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. హత్య చేసిన తరువాత పారిపోయిన నిందితుల కోసం మూడు పోలీస్ టీం. రంగంలోకి దిగారు. ఇవ్వాళ నిందితుల ను అరెస్టు చూపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈనెల 10 వ తేదీన రైల్వే స్టేషన్ ఏరియాలోని క్యాబిన్ పక్కన శరణ్య హత్య జరిగిన విషయం తెలిసిందే.
Jailer: కమల్ లైఫ్ టైమ్ రికార్డుకి ఆరు రోజుల్లోనే ఎండ్ కార్డ్…
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!