NTV Telugu Site icon

Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు

Shanker Naik

Shanker Naik

Shankar Naik: పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదని పార్టీ నాయకులకువార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు కార్యకర్తల సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదన్నారు. కొందరు నమ్మకద్రోహం చేశారు ఇప్పటికైనా వారి మార్చుకోవాలన్నారు. ఎవరెవరు ఎలా నమ్మకం ద్రోహం చేశారో అందరి చిత్తా నా దగ్గర ఉందని తెలిపారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉండి ఎలా బుక్ చదువుతున్నాడో.. తను కూడా ఇక్కడ మోసం చేసిన వారి చిత్తము చదువుతున్నానని తెలిపారు. మోసం చేసిన వాడికి తగిన బుద్ధి చెప్తా అన్నారు.

Read also: Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం

పార్లమెంటు ఎన్నికల నాటికి గట్టిగా ప్రయత్నం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడండని అన్నారు. ఈ పార్టీలో ఉండి సొంత పార్టీ అభ్యర్థికి మోసం చేస్తే సొంత కుటుంబ సభ్యులను మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. కార్యకర్తలను కాపాడుకునే సత్తా ధైర్యం నా దగ్గర ఉంది.. ఎవరు అధైర్య పడకండి పార్టీ కోసం కష్టపడండని అన్నారు. పార్టీ మారాలనుకున్నవాళ్లు ఇప్పుడే మారిపోండని తెలిపారు. అలెగ్జాండర్ అంతటివాడే ఓడిపోయాడు నేనెంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఎవరిని వదిలిపెట్టను.. సత్తా చూపెడుతా అన్నారు. పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట మొదలైంది వేటాడేస్తా అన్నారు. ఆరురోజుల్లో శబరిపోయి వస్తా.. వచ్చినంక ఎవరిని వదిలి పెట్టేది లేదన్నారు. 50 సంవత్సరాలు అయితే అయిపోయినాయి బిడ్డను అమెరికాకు పంపిస్తా.. కొడుకు సెట్ అవుతాడని అన్నారు. మోసం చేసినొన్ని ఏవన్నీ వదిలి పెట్టేది లేదన్నారు.
Andhra Pradesh: ఏపీలో దొంగ ఓట్ల పంచాయితీ.. రంగంలోకి ఈసీ..!