TS Hig Court: ఫలించిన 75 ఏళ్ల ఆదివాసీల పోరాటం.. హైకోర్టు సంచలన తీర్పు
TS Hig Court: ములుగు జిల్లాలోని ఆదివాసీల సుదీర్ఘ పోరాటం ఫలించింది. తెలంగాణ హైకోర్టు వారికి అనుకూలంగా సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది. ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యుల్ కిందకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్త జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు తీర్పును వెలువరించారు. దీంతో 75 ఏళ్ల పాటు ఆదివాసీలు చేసిన పోరాటం ఫలించింది. ఇక, ఇందుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆదివాసీల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వారు ఐదు షెడ్యూల్ పరిధిలోకి రారని ఆదివాసీయేతరులు వాదనలు వినిపించారు. అయితే ఇందుకు సంబంధించి గతంలో సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఆదివాసీయేతరుల అప్పీల్ను కొట్టివేసింది.
Read also: Warangal: కూతురు ప్రేమించిందని.. ప్రేమికుడి, స్నేహితుల ఇళ్లను తగలబెట్టిన సర్పంచ్
Also Read
- Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
- Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
- DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
- TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
కొండలపై అడవుల మధ్య జీవిస్తున్నారు. కల్మషం లేని మనసు వారిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఆదివాసీల జీవన స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ మెరుగుదల లేదు. నేడు, అనేక గిరిజన గ్రామాలు వైద్యం, విద్య మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆదివాసీలు బతుకు పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. వారి నివాసాలు ఒకప్పుడు సహజ వనరులతో సమృద్ధిగా ఉండేవి. అనేక దేశాల్లో ఆదివాసీలకు ఇప్పటికీ తగిన గుర్తింపు మరియు రక్షణ లేదు. అడవి తల్లి ఒడిలో సహజ వనరులను కాపాడుకోవడంలో గిరిజనులు చేస్తున్న కృషి ఎనలేనిది. సహజ వనరులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సహజ వనరుల పరిరక్షణ కోసం ఆదివాసీల సహకారం, పోరాటం గొప్పది. ఆధునిక సమాజంలో కొత్త పోకడలతో దూసుకెళ్తున్నా.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందిస్తున్నారు. ఇటువంటి ఆదివాసీయుల కళ ఎట్టకేలకు నెరవేరింది. 75 ఏళ్ల పాటు ఆదివాసీలు చేసిన పోరాటం నేటితో ఫలించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని కోర్టు తీర్పుతో ఆదివాసీలకు పండగవాతావరణం నెలకొంది.
Bandi Sanjay: మీ అందరికి అభినందనలు.. బండి ట్విట్ వైరల్
తాజావార్తలు
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!