Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
- పర్యాటకులకు మంత్రి సీతక్క సూచనలు
- నిషేధిత ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరిక
- సెల్ఫీల కోసం ప్రాణాలు రిస్క్ చేయొద్దు
- భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లాలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి అక్కడ నుంచే ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పర్యాటకులు తమ ఆనంద యాత్రను విషాదంగా మార్చుకోకుండా, తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం, పోలీసు , అటవీ శాఖ అధికారులు జారీ చేస్తున్న సూచనలు, హెచ్చరికలను పాటించాలని ఆ సందేశంలో విజ్ఞప్తి చేశారు.
ప్రకృతి సంపదకు నిలయం ములుగు
ములుగు జిల్లా ప్రకృతి సంపదకు నిలయమని, దట్టమైన అడవులు, గోదావరి పరీవాహక ప్రాంతం, బొగత జలపాతం, అందమైన సెలయేళ్లు, చారిత్రక , ఆధ్యాత్మిక క్షేత్రాలు ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క-సారలమ్మల మేడారం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ సురక్షితంగా వచ్చి, సంతోషకరమైన జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
Also Read
నిషేధిత ప్రాంతాలకు వెళ్లడంపై ఆందోళన
ఇటీవల ములుగు పరిధిలోని నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దట్టమైన అడవులు, ప్రమాదకరమైన జలపాతాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు , వేగంగా ప్రవహించే వాగులు, సెలయేళ్ల వద్దకు వెళ్లవద్దని ఇప్పటికే పోలీసులు, అటవీశాఖ అధికారులు విస్తృతంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ కొందరు పర్యాటకులు ఉత్సాహంతో బ్యారికేడ్లను దాటి నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సెల్ఫీల కోసం ప్రాణాలను రిస్క్ చేయవద్దు
పర్యాటకుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటరాదని, హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా గౌరవించాలని కోరారు. ముఖ్యంగా డీప్ ఫారెస్ట్ ప్రాంతాలు, లోతైన జలపాతాలు, కొండల అంచుల వద్ద సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రాణాలను రిస్క్ చేయవద్దని సూచించారు. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా, ఆనందంగా ఉంటుందని, ప్రతీ ఒక్కరూ తమతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల భద్రత పట్ల బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!