Local Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. నాలుగు రోజుల పాటు లోకల్ హాలీడేస్..
Local Holidays: మేడారం మహా జాతర ప్రారంభం కానుంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన ఉత్సవాలకు దాదాపు రెండు కోట్ల మంది భక్తులు తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు లోకల్ హాలీడేను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు పనిచేయవు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మూడు ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల పాటు విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. మహాజాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో మేడారం కుంభమేళా వైభవంగా సాగుతోంది. నాలుగు రోజుల పాటు గిరిజన సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు.
Read also: Uttarpradesh : ‘యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ కారణంగా మారుతున్న యూపీ ఆర్థిక వ్యవస్థ
Also Read
- TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
ఈ నెల 21న అర్చకులు కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. దీంతో మొదటి రోజు పూర్తయింది. 22న ముఖ్య ఘట్టమైన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. కుంకుమపువ్వు రూపంలో ఉన్న సమ్మక్కను చూసి భక్తులు పులకించిపోతున్నారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాలిలోకి కాల్పులు జరిపి ఘనస్వాగతం పలికారు. ఫిబ్రవరి 23న సమ్మక్క, సారలమ్మ, పగిద్దరాజు, గోవిందరాజు, జంపన్న సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. 24న దేవతల నిలయం. ఈ టోల్ ఫ్రీ నంబర్ ,జాతరలో మొత్తం 382 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఎనిమిది జోన్లలో 42 సెక్టార్లుగా విభజించి మూడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు అందుబాటులో ఉంటాయని, ఒక్కో జోన్లో నోడల్ అధికారి, జోనల్ అధికారి, సెక్టోరల్ అధికారి విధుల్లో ఉంటారని తెలిపారు. మరోవైపు ఇక దేవాదాయ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క నేడు మేడారంలో పర్యటించారు.
Black Currency: విశాఖలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
తాజావార్తలు
-
Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
-
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
-
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
-
2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?