Telangana: ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ విద్యార్థులు.. బడిలోనే బ్యాంకు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ విద్యార్థులు.. బడిలోనే బ్యాంకు ఏర్పాటు సాధారణంగా బ్యాంకులు రోజులో ఆరేడు గంటలు పనిచేస్తుంటాయి. కానీ ఈ బ్యాంక్ మాత్రం అరగంటే పనిచేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. ఇది బడిలోని బ్యాంక్. ఇక్కడ స్కూల్ విద్యార్థులే ఉద్యోగులు. వాళ్లే ఇక్కడ బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, క్లర్క్. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయుల చొరవతో బడిలోనే బ్యాంక్ ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన నగదును ఇందులో దాచుకుంటున్నారు. అవసరమైనప్పుడు ఈ బ్యాంకులో దాచుకున్న నగదు తీసుకుంటారు.
ఈ బ్యాంకు పేరు స్కూల్ బ్యాంకు ఆఫ్ చిల్పూర్. ఈ బ్యాంకు పెట్టాలన్న ఆలోచన 8వ తరగతిలో మనీ అండ్ బ్యాంకింగ్ గురించి పాఠం చెప్తుండగా దుడికే వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడికి కలిగింది. బ్యాంకు కార్యకలాపాల గురించి విద్యార్థులకు సవివరంగా చెప్పాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుడికి బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కలిగింది. దీంతో ప్రధానోపాధ్యాయురాలు లీల, ఇతర టీచర్లతో చర్చించి ఆయన బ్యాంకు ఏర్పాటు చేశారు. బ్యాంకు లావాదేవీలు ఎలా నిర్వహించాలో విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. డబ్బులు దాచుకునే ప్రతి విద్యార్థికి గుర్తింపు కార్డుతో కూడిన పాస్ పుస్తకం ఇచ్చారు.
Also Read
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
Read Also: Andhra Pradesh: దివిసీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు
ఇప్పటివరకు స్కూలులో చదువుకునే 158 మంది విద్యార్థులు పొదుపు ఖాతాలను ప్రారంభించారు. పే ఇన్ స్లిప్, విత్ డ్రాయల్ ఫారాలను ఉపాధ్యాయుడు దుడికే వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా ముద్రించడం విశేషం. అయితే ఈ బ్యాంక్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అరగంట చొప్పున తెరిచి ఉంటుంది. కాగా రూ.3వేలకు పైగా నగదు జమ అయితే చిల్పూర్ పోస్టాఫీసులోని పొదుపు ఖాతాలో భద్రపరుస్తామని హెచ్ఎం లీలా తెలిపారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..