Fake Caste Certificate Scam: సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల స్కామ్..
- సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల దందా..
- ఇతర రాష్ట్రాల కార్మికులే లక్ష్యంగా కొనసాగుతున్న స్కామ్..
- ఒక్కో సర్టిఫికెట్ కు రూ. 10 వేల నుంచి 20 రూ. వేల వరకు వసూలు..
- జిన్నారంలో వెలుగులోకి వచ్చిన నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Caste Certificate Scam: సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే లక్ష్యంగా ఈ దాందా కొనసాగుతుంది. ఒక్కో సర్టిఫికేట్ ని 10 వేల నుంచి 20 వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. జిన్నారం మండల కేంద్రంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ల బాగోతం బయటపడింది. చిన్న పొరపాటుతో కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. సర్టిఫికెట్ లో తేదీ తప్పు వేసి, మాజీ తహశీల్దార్ డిజిటల్ సైన్ ఫోర్జరీ చేయడంతో నకిలీ సర్టిఫికెట్ దందా బయటకి వచ్చింది. స్థానిక మీ సేవా, ఆన్ లైన్ కేంద్రాల్లో ఈ స్కామ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సర్టిఫికెట్ లో వచ్చే నెల జులై 19 తేదీతో మాజీ ఎమ్మార్వో భిక్షపతి పేరుతో డిజిటల్ సైన్ ఉంది. అయితే, కుల ధ్రువీకరణ పత్రం కోసం మనోజ్ కుమార్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. తమ కుమారుడు గౌరీ శంకర్ కి మాదిగ కులం పేరుతో సర్టిఫికెట్ జారీ చేశారు. మనోజ్ కుమార్ అనే వ్యక్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రస్తుత తహశీల్దార్ దేవదాసు ఫిర్యాదు చేశారు.
Read Also: Visakhapatnam: గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట!
Also Read
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
ఈ సందర్భంగా ఎన్టీవీతో జిన్నారం తహశీల్దార్ దేవదాసు మాట్లాడుతూ.. జిన్నారం మోడల్ స్కూల్ లో గౌరీ శంకర్ అనే విద్యార్థి అడ్మిషన్ గురించి సర్టిఫికెట్ వేరిఫికేషన్ కోసం మాకు ఈ సర్టిఫికెట్ వచ్చింది.. సర్టిఫికేట్ ను పరిశీలిస్తే వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఇంతకు ముందే రిజెక్ట్ చేసినట్టు మా రికార్డుల్లో ఉంది.. అలాగే, డేట్ కూడా తప్పుగా ఉండటంతో ఇది ఫేక్ సర్టిఫికెట్ అని నిర్దారించాం.. మాజీ ఎమ్మార్వో భిక్షపతి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇది తయారు చేశారు అని ఆరోపించారు. దీనిపై జిన్నారం పోలీస్ స్టేషన్ లో మనోజ్ కుమార్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశాం.. ఈ నకిలీ సర్టిఫికేట్ మీ సేవా కేంద్రాల నుంచి జారీ కాలేదు అన్నారు. నెట్ సెంటర్ లో దీనిని తయారు చేశారు.. ఐడీఏI బొల్లారంలో ఇతర రాష్ట్ర కార్మికులు ఎక్కువగా ఉంటారు.. కార్మికుల అవసరాల కోసం కొందరు దళారులు ఇలా చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చిందని ఎమ్మార్వో దేవదాసు వెల్లడించారు.
తాజావార్తలు
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!