BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- సంగారెడ్డి బీజేపీ శిక్షణ శిబిరంలో ఉద్రిక్తత
- జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆగ్రహం
- "పార్టీ మీ అబ్బ సొత్తు కాదు" అంటూ ఫైర్
- సమావేశం నుంచి బయటకు వెళ్లిన నేతలు, కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Sangareddy : సంగారెడ్డి జిల్లా BJP అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ శిక్షణ శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేదికపైనే నేతల మధ్య మాటల యుద్ధం నడవడంతో ఒక్కసారిగా వాతావరణం రసాభాసగా మారింది. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ మధ్య బహిరంగంగానే తీవ్ర వాగ్వివాదం జరిగింది. పార్టీ ముఖ్య నాయకులు చూస్తుండగానే నేతలు ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో ఈ సమావేశం కాస్తా రసాభాసగా ముగిసింది.
సమావేశం కొనసాగుతున్న సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఎంపీ బీబీ పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిపై ఆయన మండిపడ్డారు. “బీజేపీ పార్టీ మీ అబ్బ సొత్తు కాదు” అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీబీ పాటిల్, అవమానం జరిగిన చోట తాను ఉండలేనంటూ సమావేశం మధ్యలోనే అక్కడి నుండి విసవిసా వెళ్లిపోయారు. సీనియర్ నాయకుడైన పాటిల్ ఇలా అర్ధాంతరంగా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లడం అక్కడ ఉన్న శ్రేణులను విస్మయానికి గురిచేసింది.
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
మరోవైపు ఇదే వేదికపై పటాన్చెరు బీజేపీ యువనేత నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ సైతం జిల్లా అధ్యక్షురాలితో ఘర్షణకు దిగారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఈ సమావేశానికి అధికారికంగా ఆహ్వానించకపోవడంపై ఆయన నిలదీశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో ఆశిష్ గౌడ్ వాదించారు. అనంతరం ఆయనతో పాటు పటాన్చెరుకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా సమావేశం నుండి నిరసనగా బయటకు నడిచారు. ఈ వరుస పరిణామాలు సంగారెడ్డి జిల్లా బీజేపీలో ఉన్న వర్గపోరును మరోసారి బహిర్గతం చేశాయి.
తాజావార్తలు
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
-
Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
-
AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
-
OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
-
Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!