BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- సంగారెడ్డి బీజేపీ శిక్షణ శిబిరంలో ఉద్రిక్తత
- జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆగ్రహం
- "పార్టీ మీ అబ్బ సొత్తు కాదు" అంటూ ఫైర్
- సమావేశం నుంచి బయటకు వెళ్లిన నేతలు, కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Sangareddy : సంగారెడ్డి జిల్లా BJP అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ శిక్షణ శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేదికపైనే నేతల మధ్య మాటల యుద్ధం నడవడంతో ఒక్కసారిగా వాతావరణం రసాభాసగా మారింది. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ మధ్య బహిరంగంగానే తీవ్ర వాగ్వివాదం జరిగింది. పార్టీ ముఖ్య నాయకులు చూస్తుండగానే నేతలు ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో ఈ సమావేశం కాస్తా రసాభాసగా ముగిసింది.
సమావేశం కొనసాగుతున్న సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఎంపీ బీబీ పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిపై ఆయన మండిపడ్డారు. “బీజేపీ పార్టీ మీ అబ్బ సొత్తు కాదు” అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీబీ పాటిల్, అవమానం జరిగిన చోట తాను ఉండలేనంటూ సమావేశం మధ్యలోనే అక్కడి నుండి విసవిసా వెళ్లిపోయారు. సీనియర్ నాయకుడైన పాటిల్ ఇలా అర్ధాంతరంగా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లడం అక్కడ ఉన్న శ్రేణులను విస్మయానికి గురిచేసింది.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
మరోవైపు ఇదే వేదికపై పటాన్చెరు బీజేపీ యువనేత నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ సైతం జిల్లా అధ్యక్షురాలితో ఘర్షణకు దిగారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఈ సమావేశానికి అధికారికంగా ఆహ్వానించకపోవడంపై ఆయన నిలదీశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో ఆశిష్ గౌడ్ వాదించారు. అనంతరం ఆయనతో పాటు పటాన్చెరుకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా సమావేశం నుండి నిరసనగా బయటకు నడిచారు. ఈ వరుస పరిణామాలు సంగారెడ్డి జిల్లా బీజేపీలో ఉన్న వర్గపోరును మరోసారి బహిర్గతం చేశాయి.
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!