Rythu Bandhu in Telangana: నేటి నుంచే తెలంగాణలో పదోవిడత రైతు బంధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bandhu in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కు పెట్టుబడి సాయం కింద నేటి నుంచి రైతుబంధు నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఎకరం పొలం ఉన్న రైతుల నుంచి మొదలు పెట్టి సంక్రాంతి సందర్భంగా రైతులందరి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. నేటి నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుండగా, రైతుబంధు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7,676 కోట్ల నిధులను విడుదల చేసింది. దాదాపు 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు అందజేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 15లోపు రైతులందరి ఖాతాల్లో గతంలో జమ చేసిన విధంగా ఎకరం నుంచి నగదు జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కోతలు లేకుండా పూర్తిగా అందించాలని సూచించారు.
Read also: Bhakthi Live: బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
కేసీఆర్ ఆదేశాలతో బుధవారం నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండెకరాల లోపు పొలాలు ఉన్న రైతులకు డబ్బులు అందుతాయని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు వారం రోజుల ముందే రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. సెస్ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఆ జిల్లా రైతులకు నగదు అందింది. కరీంనగర్ జిల్లా రైతులు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 7 వరకు అవకాశం కల్పించారు. జిల్లాలో కొంతమంది కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందుకోగా.. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. కొత్త దరఖాస్తుదారులకు కూడా ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. యాసింగ్ సీజన్ కు ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుంది.
నేటి నుంచి రైతుబంధు డబ్బులు వస్తుండటంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ప్రతి ఏటా ఎకరాకు రూ.10 వేలు అందజేస్తోంది.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలోకీ ఇదే అత్యంత కీలకమైన పథకం అని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ కూడా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను సీఎంగా ఉన్నంత కాలం రైతుబంధు పథకం ఆగదని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. గత ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు తొమ్మిది విడతల డబ్బులు అందించారు.
2022 Filmy Rewind: అభిమానులను విడిచి దివికేగిన తారలు!
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..