Rythu Bandhu in Telangana: నేటి నుంచే తెలంగాణలో పదోవిడత రైతు బంధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bandhu in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కు పెట్టుబడి సాయం కింద నేటి నుంచి రైతుబంధు నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఎకరం పొలం ఉన్న రైతుల నుంచి మొదలు పెట్టి సంక్రాంతి సందర్భంగా రైతులందరి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. నేటి నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుండగా, రైతుబంధు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7,676 కోట్ల నిధులను విడుదల చేసింది. దాదాపు 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు అందజేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 15లోపు రైతులందరి ఖాతాల్లో గతంలో జమ చేసిన విధంగా ఎకరం నుంచి నగదు జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కోతలు లేకుండా పూర్తిగా అందించాలని సూచించారు.
Read also: Bhakthi Live: బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
కేసీఆర్ ఆదేశాలతో బుధవారం నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండెకరాల లోపు పొలాలు ఉన్న రైతులకు డబ్బులు అందుతాయని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు వారం రోజుల ముందే రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. సెస్ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఆ జిల్లా రైతులకు నగదు అందింది. కరీంనగర్ జిల్లా రైతులు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 7 వరకు అవకాశం కల్పించారు. జిల్లాలో కొంతమంది కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందుకోగా.. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. కొత్త దరఖాస్తుదారులకు కూడా ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. యాసింగ్ సీజన్ కు ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుంది.
నేటి నుంచి రైతుబంధు డబ్బులు వస్తుండటంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ప్రతి ఏటా ఎకరాకు రూ.10 వేలు అందజేస్తోంది.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలోకీ ఇదే అత్యంత కీలకమైన పథకం అని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ కూడా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను సీఎంగా ఉన్నంత కాలం రైతుబంధు పథకం ఆగదని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. గత ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు తొమ్మిది విడతల డబ్బులు అందించారు.
2022 Filmy Rewind: అభిమానులను విడిచి దివికేగిన తారలు!
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!