RTC MD Sajjanar: ఆ చర్యల వల్ల నష్టాలు తగ్గి.. ఆదాయం పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC MD Sajjanar Talks About Financial Status Of TSRTC: టీఎస్ ఆర్టీసీ ప్రగతి రథంవైపు నడుస్తోందని.. ఈ ఏడాది చారిత్రాత్మకమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తాను ఎండీ బాధ్యతల్ని స్వీకరించానని.. కొవిడ్, సమ్మె, డీజిల్ ధరలు లాంటి సమస్యల్ని ఎదుర్కొన్నామని అన్నారు. చార్జీల పెంపుతో పాటు మరికొన్ని చర్యలు తీసుకోవడం వల్ల.. ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. రోజుకు రూ. 13 కోట్ల ఆదాయం వస్తోందని పేర్కొన్న ఆయన.. రూ. 395 కోట్ల నష్టం మాత్రమే ఉందన్నారు. రూ. 641 కోట్ల నష్టాలను తగ్గించామని తెలిపారు. నష్టాలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయని, సుమారు 1500 కోట్ల నష్టాలు తగ్గించామని, ఆక్యుపెన్సీ 10 శాతం పెరిగిందని వివరించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని సజ్జనార్ చెప్పుకొచ్చారు.
ఇక టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. నిన్నటికి తాను పదవి చేపట్టి ఏడాది పూర్తయ్యిందన్నారు. తనకు చైర్మెన్ పదవి వచ్చినప్పుడు, ఎందుకు తీసుకున్నామని చాలామంది ప్రశ్నించారని.. అయితే తనకు ఛాలెంజింగ్ ఇష్యూస్ ఇష్టం కావడం వల్ల ఈ బాధ్యతల్ని స్వీకరించానని అన్నారు. గతేడాదిలో హైదరాబాద్ ఆదాయం రూ. 306 కోట్లు అయితే.. ఈ ఏడాదిలో రూ. 603 కోట్లకు పెరిగిందన్నారు. ఆయా జిల్లాల పరిధిలో ఆదాయం గణనీయంగా పెరగడం వల్లే.. వచ్చే ఆదాయం రెట్టింపయ్యిందన్నారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల సెస్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని.. దానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని తాము భావించామని, కానీ ప్రజలు దాన్ని స్వీకరించారని పేర్కొన్నారు.
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
గతంలో ఆర్టీసీలో అనేక సమస్యలు ఉండేవని, తాము ఆర్టీసీతో పాటు సిబ్బందిని సైతం కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. లాభాల బాట పట్టకపోయినా.. నష్టాల్ని పూడ్చుతూ తాము సఫలీకృతమవుతున్నామన్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయమని హామీ ఇచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్.. కొత్త బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం 60 శాతం ప్రభుత్వ బస్సులతో పాటు కొన్ని అద్దె బస్సులున్నాయన్నారు.
తాజావార్తలు
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
-
Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..