NTV Telugu Site icon

Revanth reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

Revanth

Revanth

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. పోలీస్ ఉద్యగోల భర్తీలో వయోపరిమితిని పెంచాలని కోరతూ బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల రిక్రూట్ మెంట్లో వయో పరిమితిన సడలింపు ఇవ్వాలని సీఎంను కోరారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఆలస్యం అవ్వడం వల్ల వయోపరిమితితో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆస్క్ కేటీఆర్ లో అభ్యర్థులు అడిగినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో అలసత్వం చూపించడం వల్ల చాలా మంది అభ్యర్థుల ఏజ్ బార్ అయిపోయిందన్నారు.

ఇప్పుడు మీ ప్రభుత్వం 17 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని.. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు అధికంగా ఉన్నాయని.. మీ ప్రభుత్వ నిర్వాకం వల్ల లక్షలాది మంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారని లేఖలో విమర్శించారు. నాలుగేళ్ల తరువాత నోటిఫికేషన్ రావడం, కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని…దీంతో చాలా మంది ఉద్యోగార్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారని.. అయితే ప్రభుత్వ మూడేళ్లు మాత్రమే వయోపరిమితి సడలింపు ఇవ్వడంతో నాలుగు లక్షల మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరం అయ్యారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

యూపీఎస్సీ భర్తీ చేసే ఐపీఎస్ పోస్టులతో పాటు పలు రాష్ట్రాల యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 32 ఏళ్లుగా ఉందని…. మొత్తంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో 5 ఏళ్లు వయోపరిమితి  ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆస్క్ కేటీఆర్ లో సమస్యను విన్నవించుకున్నా స్పందించలేదని… హోంశాఖ చూసే మంత్రి ఉన్నాడో లేదో తెలియదని.. మీరేమే ఇవన్నీ పట్టనట్లు ఫామ్ హౌజ్ లో సేద తీరుతున్నారని సీఎం కేసీఆర్ ను లేఖలో విమర్శించారు.