Revanth Reddy: వినాశకాలే విపరీత బుద్ధి.. కేసీఆర్ కుట్ర చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Sensational Comments On KCR After BRS Announce: దసరా సందర్భంగా జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించిన సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడం ఓ దుర్మార్గపు ఆలోచన అని విమర్శించిన ఆయన.. కేసీఆర్కు తెలంగాణలో పోటీ చేయడానికి అర్హత లేదని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్కు ఋణం తీరిపోయిందని.. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని అన్నారు. 2001 నుండి 2022 వరకు కేసీఆర్ ఆర్ధికంగా బలోపేతమయ్యారని పేర్కొన్నారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ కొత్త పార్టీ తెచ్చారన్న ఆయన.. రేపు ప్రపంచ రాష్ట్ర సమితి అని పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కేసీఆర్ వ్యవహారం ఉందని.. కేవలం కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే ఆయన జాతీయ పార్టీ పెట్టారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ’ పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఆయన ఆ పదాన్ని పూర్తిగా చంపేయాలనుకుంటున్నారని తూర్పారపట్టారు. అయితే.. తెలంగాణ ప్రజల జీవనంలో ‘తెలంగాణ’ అనే పదం ఓ భాగమని, తెలంగాణ హంతకుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరో 12 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయిందని అన్నారు.
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
ఇదిలావుండగా.. నవంబర్లో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చిన ఆ పార్టీ.. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజల్ని ఆకర్షించేందుకు తమదైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మరోవైపు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతల సమక్షంలో.. టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ప్రకటన చేశారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!