Revanth Reddy: వినాశకాలే విపరీత బుద్ధి.. కేసీఆర్ కుట్ర చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Sensational Comments On KCR After BRS Announce: దసరా సందర్భంగా జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించిన సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడం ఓ దుర్మార్గపు ఆలోచన అని విమర్శించిన ఆయన.. కేసీఆర్కు తెలంగాణలో పోటీ చేయడానికి అర్హత లేదని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్కు ఋణం తీరిపోయిందని.. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని అన్నారు. 2001 నుండి 2022 వరకు కేసీఆర్ ఆర్ధికంగా బలోపేతమయ్యారని పేర్కొన్నారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ కొత్త పార్టీ తెచ్చారన్న ఆయన.. రేపు ప్రపంచ రాష్ట్ర సమితి అని పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కేసీఆర్ వ్యవహారం ఉందని.. కేవలం కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే ఆయన జాతీయ పార్టీ పెట్టారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ’ పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఆయన ఆ పదాన్ని పూర్తిగా చంపేయాలనుకుంటున్నారని తూర్పారపట్టారు. అయితే.. తెలంగాణ ప్రజల జీవనంలో ‘తెలంగాణ’ అనే పదం ఓ భాగమని, తెలంగాణ హంతకుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరో 12 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయిందని అన్నారు.
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ఇదిలావుండగా.. నవంబర్లో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చిన ఆ పార్టీ.. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజల్ని ఆకర్షించేందుకు తమదైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మరోవైపు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతల సమక్షంలో.. టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ప్రకటన చేశారు.
తాజావార్తలు
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!