Revanth Reddy: మహేశ్వరంలో కె.ఎల్.ఆర్ కు 25వేల మెజారిటీ ఖాయం.. ప్రచారంలో రేవంత్ రెడ్డి
Revanth Reddy: మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, 25 వేల మెజారిటీతో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గెలవబోతున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్ కె పురం అష్టలక్ష్మి కమాన్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ హాజరైన రేవంత్ రెడ్డికి మహేశ్వరం కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీ ఆర్ ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి కి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులకు,నియోజకవర్గ ప్రజలకు ఉందని తెలిపారు. కె ఎల్ ఆర్ వంటి నాయకులు అసెంబ్లీలో ఉండాలని, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తో తెలంగాణ లో కాంగ్రెస్ కు బలం చేకూరి తెలంగాణ లో కూడా అధికారంలోకి రావడం ఖాయం అనిఅన్నారు.
ఈ నెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సోనియమ్మకు జన్మదిన కానుక ఇచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెనగిరి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం అభివృద్ధి బాధ్యత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. గతంలో కూడా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం దళితులు అసెంబ్లీలో గళం విప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, కాంగ్రెస్లో భాజపా, భార్స పార్టీల భారీ భాగస్వామ్యంతో బల నిరూపణకు సిద్ధమైందన్నారు. లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. గెలుపే ధ్యేయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారన్నారు.
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
మహేశ్వరం నియోజకవర్గానికి పరాభవం కలిగించిన సబితమ్మను పూర్తిగా ఓడించాలని సూచించారు. పార్టీ ప్రకటించిన ఆరు హామీలను ప్రజలతో మమేకం చేస్తూ ప్రజలకు చేరవేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంటే చూడలేక బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. హస్తం పార్టీ సృష్టించిన సునామీలో బీఆర్ఎస్, బీజేపీలు ఓడిపోయాయని, మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్వరంలో అభివృద్ధి కనిపించడం లేదని, నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బరస అభ్యర్థి సబితమ్మకు సవాల్ విసిరారు.
Mitchell Marsh FIR: ఢిల్లీలో మిచెల్ మార్ష్పై ఎఫ్ఐఆర్ నమోదు.. టీమిండియాపై ఆడుకుండా జీవితకాల నిషేధం..!
తాజావార్తలు
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!